In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం ఇవాళ (మే 25) కూడా కనిపిస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅడుగడుగున పోలీసు బృందాలు మోహరించి అమలాపురం పట్టణమంతా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఏలురు రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ విశాల్ గున్నీ, తదితర పదిమంది ఐపీఎస్ అధికారులు, 15 మంది డీఎస్పీలు పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మంగళవారం కలెక్టరేట్, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల వద్ద జరిగిన విధ్వంస కాండలో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిని గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.
అమలాపురం వెళ్తున్న అన్ని బస్సుల నిలిపివేత
విశాఖపట్నం నుండి అమలాపురం వెళ్లే బస్సులు కాకినాడలో.. రాజమండ్రి నుండి వెళ్ళే బస్సులను రావుల పాలెంలోనూ నిలిపివేత
ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా అమలాపురంలో భయభ్రాంతులు నెలకొన్నాయి.
రాత్రి 12 గంటల తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీని ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కోనసీమలో కర్ఫ్యూ ప్రకటించారు.