Alla Ramakrishna Reddy: మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వైసీపీ అధికార ప్రతినిధి ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పచ్చల శ్యామ్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కు పాల్పడ్డారని ఆరోపించారు. ఓటర్లకు పంచమని మంగళగిరి మండలం నవులూరులో 2 కోట్ల రూపాయలు ఇచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబుపై కేసు వేయడం కాదని, ముందు ఆళ్ల తన నిజాయతీని నిరూపించుకోవాలని అన్నారు. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సత్యహరిశ్చంద్రుడేమీ కాదని అన్నారు.


‘‘ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఏమీ సత్య హరిశ్చంద్రుడుకాదు. మంగళగిరిలో టీడీపీ బీసీ నేత ఉమా యాదవ్ హత్యకు ఎమ్మెల్యే ఆర్కేనే కారణం. హత్యకు ముందు కాల్ రికార్డులను పరిశీలిస్తే దొరికి పోతాడు. అభిమానించిన నాయకులను కార్యకర్తలను నట్టేట ముంచాడు. మంగళగిరిలో రూ.7 - 8 కోట్లు ఖర్చు చేశాను అంటున్నావు, నీకు ఉన్న వేల కోట్ల ఆస్తులకు అవి ఒక లెక్కా?’’ అని వైసీపీ అధికారప్రతినిధి పచ్చల శ్యామ్ విమర్శలు చేశారు.