Shubhanshu Shukla : NASAకు చెందిన Axiom 4 మిషన్ అనేక అవంతరాలు, ఇతర సమస్యలు దాటుకొని బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమైంది. SpaceX నిర్వహించే ఈ మిషన్‌లో శుభాన్షు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ట్రావెల్ చేస్తున్నారు. SpaceX కొత్త డ్రాగన్ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి బయల్దేరింది. ఈ అంతరిక్ష నౌకను కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. 

NASA ముందుగా చెప్పినట్టు గురువారం సాయంత్రం 4:30 గంటలకు IST వద్ద డాక్ చేయనుంది. Axiom 4 మిషన్‌లో అమెరికన్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వంలో నలుగురు సిబ్బంది ఉంటారు, శుక్లా పైలట్‌గా ఉంటారు. పోలాండ్‌కు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన HUNOR వ్యోమగామి టిబోర్ మిషన్ నిపుణులుగా వ్యవహరిస్తారు. వ్యోమగాములు 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటారు, అక్కడ వారు దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు.

Axiom 4 మిషన్ NASA, Axiom Space,SpaceX సహకారంతో నిర్వహించే నాల్గో ప్రైవేట్ అంతరిక్ష యాత్ర. ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా సహా నాలుగురు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఈ మిషన్‌లో 31 దేశాలకు చెందిన 60కుపైగా పరిశోధనలు చేయనున్నారు. ఇందులో భారత్‌ నుంచి కూడా ప్రయోగాలు చేయనున్నారు.  

శుభాంశు శుక్లా అంతరిక్షంలో ఏం చేస్తారు?  శుభాంశు శుక్లా ప్రధానంగా ఏడు పరిశోధనలు చేయనున్నారు. ఆరోగ్యం, పోషణ, మైక్రోగ్రావిటీ పరిస్థితులపై అధ్యయనం చేస్తారు. ఈ ప్రయోగాలు భారత భవిష్యత్ అంతరిక్ష మిషన్‌నైన గగన్‌యాన్ యూజ్ కానుంది. 

మెంతులు, పెసర పెంపకం: శుభాంశు అంతరిక్షంలో మెంతులు, పెసర పెరుగుదలపై ప్రయోగాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రయోగం మైక్రోగ్రావిటీలో పంటల పెరుగుదలను అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయాణాల్లో ఆహార అవసరాల కోసం కూడా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. 

మైక్రోఅల్గా పరిశోధన: ఆయన మైక్రోఅల్గా వృద్ధి, మెటబాలిజంపై అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధన అంతరిక్షంలో ఆక్సిజన్ ఉత్పత్తి, ఆహార వృద్ధిపై సరికొత్త ఆశలు రేకెత్తించనుంది.  

సైనోబ్యాక్టీరియా అధ్యయనం: రెండు రకాల సైనోబ్యాక్టీరియా, సెల్ స్పందనలను పరీక్షిస్తారు. ఇది అంతరిక్షంలో జీవ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

పంట గింజల పెరుగుదల: అంతరిక్షంలో పంట గింజల పెరుగుదల, దాని ప్రభావాలు పరీక్షిస్తాడు. ఈ డేటా భవిష్యత్ అంతరిక్ష కాలనీల కోసం ఆహార ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

కాగ్నిటివ్ పరిశోధన: కంప్యూటర్ స్క్రీన్‌ల వినియోగం మైక్రోగ్రావిటీలో మనిషి మెదడుపై ఎలా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేస్తారు.  

ఈ ప్రయోగాలను ISRO, NASA, భారత డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT) సహకారంతో చేస్తున్నారు.  

ఈ ప్రయోగాల ప్రయోజనాలేంటీ?శుభాంశు శుక్లా చేసే ఈ పరిశోధనలు భారత గగన్‌యాన్ మిషన్‌కు గొప్ప మద్దతు ఇవ్వనున్నాయి. ఇది 2027లో జరగనుంది. ఈ ప్రయోగాల ద్వారా అంతరిక్షంలో ఆహార ఉత్పత్తి, ఆక్సిజన్ సరఫరా, ఆస్ట్రోనాట్‌ల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక డేటా సేకరించనుంది. శుభాంశు శుక్లా ఈ మిషన్ కోసం ఎంతో కఠినమైన శిక్షణ పొందారు. 2019లో ISROచే ఎంపికైన ఆయన రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందారు.