Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి- భారత విదేశాంగ శాఖ ప్రకటన

ABP Desam Updated at: 01 Mar 2022 07:32 PM (IST)
Edited By: Murali Krishna

ఉక్రెయిన్‌లో జరుగుతోన్న దాడులలో భారత విద్యార్థి మృతి చెందాడు.

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి- భారత విదేశాంగ శాఖ ప్రకటన

NEXT PREV

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న భీకర దాడుల్లో భారత విద్యార్థి మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి ఈ దాడుల్లో మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.



బాధాతప్త హృదయాలతో ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాం. ఖార్కివ్‌లో జరిగిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబ సభ్యులకు విదేశాంగ శాఖ విషయాన్ని తెలియజేసింది. అతని కుటుంబానికి మా సంతాపం వ్యక్తం చేస్తున్నాం.                                              -     అరిందమ్ బగిచీ, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి






ఖార్కివ్ నగరంలో ఈ రోజు రష్యా సైన్యం భీకర దాడులతో విరుచుకుపడింది. నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్లిన సమయంలో సైనిక దళాల షెల్లింగ్​లో నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, భారత విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది.


కీవ్‌ నగరమే టార్గెట్






ఉక్రెయిన్ రాజధాని కీవ్​ లక్ష్యంగా రష్యా సేనలు వేగంగా కదులుతున్నాయి. ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ కీవ్ వైపు వెళ్తోన్న ఉపగ్రహ చిత్రాలు ఈరోజు సోషల్ మీడియాలో కనిపించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నగరాల్లో ఈ ఉదయం నుంచి ఎయిర్‌ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. 


మరోవైపు ఖార్కివ్ నగరంలో రష్యా సైనికులు కాల్పుల మోత మోగిస్తున్నారు. ఈ కాల్పుల్లోనే నవీన్ మృతి చెందినట్లు తెలుస్తోంది.



Also Read: Russia Ukraine War: భారత విద్యార్థులారా కీవ్ నగరం నుంచి వెంటనే బయలుదేరండి: భారత ఎంబసీ






 

Published at: 01 Mar 2022 03:17 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.