Pakistan PM  visit to air base draws laughter : పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎలా ఉంటుంది..? . నక్కను చూసి నవ్వాపుకోలేరు. అలాంటి  పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్  కు ఎదురవుతోంది. అందరూ పాకిస్తాన్ దరిద్రాన్ని చూసి నవ్వుతున్నారు.  

భారత ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్ సరిహద్దులోని అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడి నుంచి పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మోదీని చూసి.. పాకిస్తాన్ ప్రధాని కూడా అలాగే వెళ్లాలనుకున్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తో కలిసి వెళ్లారు. 

ఆ  వీడియోను పాకిస్తాన్ ప్రభుతవం రిలీజ్ చేశారు. కానీ ఆ వీడియోను చూసిన వారు పాకిస్తాన్ దుస్థితి ఇంత ఘోరంగా ఉందని  చూసుకుని నవ్వుకుంటున్నారు.  పాకిస్తాన్ ప్రధాని వెళ్లిన ప్రాంతం ఎయిర్ బేసో.. ఆర్మీబేసో తెలియదు. ఎదో అడవుల్లో దాక్కున్న  వాళ్లను కలవడానికి వెళ్లినట్లుగా వెళ్లారు. ఆ బేస్ లో ఒక్క కట్టడం లేదు. గోనెపట్టాలు కట్టుకుని దాని కింద సైనికులు సేదదీరుతున్నారు.  

అక్కడికి వెళ్లడానికి పాక్ ప్రధాని గతుకుల రోడ్డులో కిందా మీదా పడుతూ వెల్లారు.   పోని అక్కడ ప్రధాని సైనికులతో మాట్లాడటానికి ఓ వేదిక ఉందా అంటే అదీ లేదు. గడ్డితో కప్పేసిన యుద్ధట్యాంకు మీద నిల్చుని మాట్లాడారు. అంతకు మించి ఆ సైనికుల దగ్గర కూడా ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు. 

భారత ప్రధాని అదంపూర్ కు ఎయిర్ ఫోర్స్ విమానంలో వెళ్లారు. అత్యాధునిక ఆయుధాలను  చూపించారు. పాకిస్తాన్ ధ్వంసం చేశామని చెప్పుకున్న వాటిని చూపించారు. కానీ పాక్ ప్రధాని తమ దగ్గర రైఫిల్స్ ఉన్నాయని కూడా చూపించుకోలేకపోయారు. 

పాక్ ప్రభుత్వం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పాక్ పరిస్థితిఘోరంగా ఉందని ఇప్పుడు సాక్ష్యాలతో సహా అర్థమయిందని సెటైర్లు వేస్తున్నారు.