Lottery Jackpot:  అదృష్టం... ఎప్పుడు, ఎలా, ఎవరి తలుపు తడుతుందో తెలియదు. ఒక్కసారి లక్ కలిసివస్తే నిరుపేదలు కూడా కోటీశ్వరులైపోతారు. చేతిలో చిల్లిగవ్వ లేనివారు కోట్లకు పడగలెత్తుతారు. అలాంటి అదృష్టం ఎవరి జీవితంలో అయినా ఒకేసారి వస్తుంది. అలాంటి అదృష్టమే ఇప్పుడు ఒక వ్యక్తిని అకస్మాత్తుగా బిలియనీర్ ని చేసేసింది. ఒక్క రాత్రిలో కోహ్లీ, ధోనీ, షారుఖ్ ఇలా ఎందరో సెలబ్రిటీల కన్నా ఎక్కువ సంపాదనపరున్ని చేసింది. మరి ఈ కథాకమీషు ఏమిటో తెలుసుకోవాలనుందా..


రూ. 16,900 కోట్ల రూపాయల లాటరీ


ఒక న్యూస్ వెబ్ సైట్ ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ క్యాస్ట్రో అనే వ్యక్తి లాటరీలో ఏకంగా రూ. 16,900 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే అతను బిలియనీర్ అయిపోయాడు. ఎడ్విన్ గెలుచుకున్న డబ్బు లాటరీ చరిత్రలోనే అత్యధికం అని నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఎడ్విన్ సంపాదనలో.. విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, షారుఖ్ ఖాన్ ఇలా ఇంకా ఎంతోమంది సెలబ్రిటీల కన్నా ఎంతో ఎత్తులో ఉన్నాడు.  షారుఖ్ ఆస్తుల విలువ రూ. 6,600 కోట్లు కాగా.. విరాట్ కోహ్లీ సంపాదన రూ. 1100 కోట్లు. ఇక భారత్ మాజీ కెప్టెన్ ధోనీ ఆస్తులు రూ. 750 కోట్లు.


డబ్బు తీసుకున్నాడు.. మాయమైపోయాడు 


న్యూస్ వెబ్ సైట్ మెట్రో ప్రకారం.. ఎడ్విన్ 2022 నవంబర్ లో లాటరీ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఈ మొత్తం అతనికి అందాలంటే వాయిదా పద్ధతిలో 29 ఏళ్లలో తీసుకోవాలని లాటరీ నిర్వహించిన కంపెనీ తెలిపింది. అయితే ఎడ్విన్ మొత్తం డబ్బు ఒకేసారి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతనికి రూ. 8వేల కోట్లు వచ్చాయి. ఇంత భారీ మొత్తం అందుకున్న ఎడ్విన్ ప్రపంచం ముందుకు రావడంలేదు. కనీసం మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. డబ్బు అందిన వెంటనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. లాటరీ ద్వారా ఇంత పెద్ద మొత్తం గెలుచుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అనే ఒక చిన్న స్టేట్ మెంట్ మాత్రం ఇచ్చాడు. 

రూ.81 కోట్ల లాటరీ గెలిచాడు ఇక భార్య కోసం వెతుకుతున్నాడు!

జర్మనీకి చెందిన ఓ యువకుడికి ఈ మధ్య కనీవినీ ఎరుగని లాటరీ తగిలించింది. ఏకంగా రూ. 81 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. డార్ట్‌మండ్‌కు చెందిన కుర్సాట్ యిల్డిరిమ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే వాడు. కొద్ది రోజుల కిందట లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. వాటి ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇందులో ఏకంగా 9,927,511,60 యూరోలు అంటే భారత కరెన్సీలో రూ. 81 కోట్లు గెలుచుకున్నాడు.


విలాస వంతమైన కార్లు కొనుగోలు చేస్తున్న కుర్సాట్


ఒక్కసారిగా ఊహించని రీతిలో డబ్బులు రావడంతో ఏం చేయాలో కుర్సాట్ కు అర్థం కాలేదు. ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలా? అని రకరకాలుగా ఆలోచించాడు. ముందుగు తను పని చేసే స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాన్ని వదిలేశాడు.  రూ. 3.6 కోట్ల ఫెరారీ 448 పిస్తాను కొనుగోలు చేశాడు. దాంతో పాటు  రూ. 2 కోట్లతో పోర్షే టర్బో ఎస్ క్యాబ్రియోలెట్‌ కొన్నాడు.  ఒక ఖరీదైన వాచ్, అతనికి ఇష్టమైన బూజర్‌ను కూడా కొనుగోలు చేశాడు.


భార్య కోసం అణ్వేషణ, పత్రికల సాయం