Aditi Tripathi: 


అదితి త్రిపాఠి కథ ఇది..


ఓ పదేళ్ల బాలిక 50 దేశాలు చుట్టొచ్చింది. అది కూడా ఒక్క రోజు కూడా స్కూల్ ఎగ్గొట్టకుండా. ఇదెలా సాధ్యం..? అది తెలుసుకోవాలంటే మొత్తం కథ తెలుసుకోవాలి. ఈ బాలిక పేరు అదితి త్రిపాఠి. Yahoo Life వెల్లడించిన వివరాల ప్రకారం..అదితి సౌత్‌ లండన్‌లో ఉంటోంది. తల్లిదండ్రులు దీపక్, అవిలాష. భారత సంతతికి చెందిన వీళ్లిద్దరికీ ప్రపంచ దేశాలు చుట్టి రావడం ఓ అలవాటు. ఇప్పటికే యూరప్ అంతా తిరిగేశారు. నేపాల్, సింగపూర్, థాయ్‌లాండ్‌ కూడా చుట్టొచ్చారు. వాళ్లు తిరగడమే కాదు. కూతురిని కూడా తమతో పాటు తీసుకెళ్లాలని అనుకున్నారు. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు..ఇలా అన్నింటినీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో కూతురిని వెంట పెట్టుకుని అన్ని దేశాల్లో పర్యటించారు. మరి ఇలా తిరుగుతూ ఉంటే ఎడ్యుకేషన్‌కి ఇబ్బంది అవుతుందన్న డౌట్ వచ్చింది. వెంటనే ఇద్దరూ ఓ ప్లాన్ వేసుకున్నారు. తన చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా స్కూల్‌కి సెలవున్న రోజు మాత్రమే ట్రావెల్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. బ్యాంక్‌ హాలిడేస్‌లలోనూ తిరిగారు. ఏడాది పాటు ఇలా తిరుగుతూనే ఉన్నారు. 50 దేశాలు చుట్టొచ్చారు. ఇందుకోసం అక్షరాలా రూ.21 లక్షలు ఖర్చు చేశారు. కానీ...తాము ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి తగిని ఎక్స్‌పీరియెన్స్‌ని సంపాదించుకున్నామని చెబుతోంది ఈ జంట. 


" మా కూతురితో కలిసి నేపాల్, ఇండియా, థాయ్‌లాండ్‌ తిరిగాం. అక్కడి కల్చర్‌ని చూసి తను చాలా ఎగ్జైట్ అయింది. తనకు మూడేళ్లు ఉన్నప్పటి నుంచే ఇలా విదేశాల పర్యటన మొదలు పెట్టాం. వారానికి రెండున్న రోజులు స్కూల్‌కి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాం. ఒక్కోసారి తనను స్కూల్‌ నుంచి పికప్ చేసుకుని నేరుగా ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్లిపోతాం"


- అవిలాష, అదితి త్రిపాఠి తల్లి


ట్రిప్స్ కోసమే సేవింగ్స్..


ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారు..? అని డౌట్ రావడం సహజమే. ఈ ఇద్దరూ అకౌంటెట్స్‌లా  పని చేస్తున్నారు. ఈ ట్రిప్స్‌ కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పెట్టుకుంటారు. బయట తినకుండా ఖర్చులు తగ్గించుకుంటారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే వాడతారు. సొంత కార్ కూడా లేదు. ఇక ప్రయాణ ఖర్చులు తగ్గించుకోడానికి వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తారు. ఇలా పక్కా ప్లాన్‌తో ట్రిప్‌లు వేస్తోంది ఈ ఫ్యామిలీ. 


"నా ఫేవరెట్ కంట్రీ ఏంటి అంటే స్పెసిఫిక్‌గా చెప్పలేను. కానీ...నేపాల్, జార్జియా, అర్మేనియా చాలా బాగా నచ్చాయి. నేపాల్ అయితే బాగా నచ్చింది. అక్కడే హార్స్ రైడ్ చేశాను. కేబుల్‌ కార్‌లో ట్రావెల్ చేశాను. అక్కడి నుంచే ఎవరెస్ట్ శిఖరాన్ని చూశాను. ట్రావెల్ అంటే నాకు చాలా ఇష్టం. సోషల్ స్కిల్స్‌ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి ట్రిప్స్ వేయడం మంచిదే. మిగతా పిల్లలు కూడా నాలా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు మూడేళ్లప్పుడు జర్మనీ ట్రిప్‌కి వెళ్లాను. ఆ తరవాత ఫ్రాన్స్ , ఇటలీ, ఆస్ట్రియా కూడా వెళ్లాను. "


- అదితి త్రిపాఠి


Also Read: బీజేపీతో కలిసేందుకు జేడీఎస్ ఆసక్తి, NDAలో చేరడంపై మాత్రం సస్పెన్స్