భారత్ తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఇతర దేశాలకు ప్రయోజనం చేకూర్చే ముందు తన సొంత ప్రయోజనాల గురించి భారత్ ఆలోచించుకుంటుంది. కానీ, పాక్‌లో అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్లే ప్రస్తుత సంక్షోభం నడుస్తోంది. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి, అయినా రష్యా నుంచి చమురు తీసుకుంటోంది. చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్‌కు అమెరికా సూచించినప్పుడు తమ దేశానికి ఏది మంచో ఆ కోణంలోనే నిర్ణయం తీసుకుంటామని సూటిగా చెప్పేసింది. భారత్‌ విదేశాంగ విధానం అనేది తన సొంత ప్రజల కోసం.                                                                     -  ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని