చిన్నప్పుడు చందమామా రావే.. జాబిలి రావే అంటూ పాటలు పాడుకుంటూ పెరిగిన మనం ఇప్పుడు చంద్రుని వద్దకే వెళ్తున్నాం. కాలం మారుతున్న కొద్ది ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలతో ముందుకు దూసుకుపోతున్నాం. రానున్న రోజుల్లో ఇతర గ్రహాల మీదకు కూడా వెళ్తామని నాసా వారు ఎంతో గట్టిగా చెబుతున్నారు. ఈ క్రమంలో కొంతమందిలో వింత ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవి ఏంటంటే..భూమి మీద నుంచి వెళ్లిన మనిషి అంతరిక్షంలో చనిపోతే ఏం చేస్తారు అని. మానవ అంతరిక్ష పరిశోధనలు కేవలం 60 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు అంతరిక్షంలో 20 మంది వరకు చనిపోయారు. 


1986 నుంచి 2023 నాటికి నాసా స్పేస్‌ షటిల్ విషాదాలలో సుమారు 14 మంది, 1971 సోయుజ్‌ 11 మిషన్‌ లో ముగ్గురు, 1967 లో అపోలో 1 లాంచ్‌ ప్యాడ్ సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు. రానున్న కాలంలో అంగారకుడి పైకి వ్యోమగాములను పంపాలని నాసా యోచిస్తోంది.


అంతరిక్షంలో ఎవరైనా చనిపోతే ఏమవుతుంది అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. అక్కడ చనిపోయిన వారి శరీరాన్ని ఏం చేస్తారు అని ఎంతో మంది మదిలో  మెదిలే ప్రశ్న. అంతరిక్షానికి వెళ్లే క్రమంలో భూమి కంటే తక్కువ కక్ష్య మిషన్‌ లో కానీ ఎవరైనా చనిపోతే ఆ సిబ్బంది శరీరాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే క్యాప్సూల్ లో భూమికి తిరిగి పంపవచ్చు.


ఒక వేళ ఇదే ఘటన చంద్రుని మీద కనుక జరిగితే శరీరం కేవలం కొన్ని రోజుల్లోనే భూమికి చేరుతుంది. నాసా ఇలాంటి వాటి కోసం ఇప్పటికే కొన్ని వివరణలను కలిగి ఉంది. అదే అంగారక గ్రహానికి కానీ 300 మిలియన్ మైళ్ల దూర ప్రయాణంలో కానీ వ్యోమగామి చనిపోతే  ఆ విషయాలు భిన్నంగా ఉంటాయి.


అక్కడ నుంచి శరీరాన్ని తిరిగి పంపాలేరు. దానిని పట్టుకుని తిరగలేరు. అందుకే మిషన్ ముగింపు లో శరీరం సిబ్బందితో కలిసి భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సమయంలో, సిబ్బంది మృతదేహాన్ని ప్రత్యేక గదిలో లేదా ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచవచ్చు. అంతరిక్ష వాహనం లోపల స్థిరమైన ఉష్ణోగ్రత,  తేమ శరీరాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి.


స్పేస్‌సూట్ లేకుండా అంతరిక్షంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుంది? 
అంతరిక్షం లేకుండా వ్యోమగామి దాదాపు తక్షణమే చనిపోతాడు. శ్వాస తీసుకోవడం కూడా అసాధ్యం. తొలుత రక్త ప్రవాహం నిలిచిపోతుంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది ఒకచోటు చేరడం మొదలవుతుంది. ఈ క్రియను లివోర్‌ మోర్టిస్ అంటారు. ఆ తర్వాత శరీరం పూర్తిగా చల్లబడిపోతుంది. ప్రారంభమవుతుంది. అనంతరం కండరాల్లో అపరిమితంగా కాల్షియం పేరుకుపోయి, అవి బిగుసుకుపోవడం మొదలవుతుంది. ఎంజైమ్‌ ల, ప్రోటీన్లు ..కణాల గోడలను విచ్ఛిన్నం చేస్తాయి.


ఇదే సమయంలో పేగుల్లోని బ్యాక్టీరియా శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. మృదు కణజాలాన్ని తినేస్తుంది. వాటి నుంచి వెలువడే వాయువులతో శరీరం ఉబ్బిపోతుంది. ఇదే సమయంలో కండరాలు కూడా నాశనం కావడం వల్ల రిగోర్ మోర్టిస్‌ ఆగిపోతుంది. దుర్వసన మొదలవుతుంది.


స్పేస్ సూట్ లేకుండా చంద్రుడు లేదా అంగారక గ్రహంపైకి అడుగు పెడితే! 
చంద్రుడికి అసలు వాతావరణం అనేది లేదు. దాదాపు ఆక్సిజన్ లేదు కాబట్టి ఫలితంగా వెంటనే చనిపోతాడు. శరీరంలోని బాక్టీరియా మరియు ఇతర జీవులు మార్టిన్ ఉపరితలాన్ని కలుషితం చేస్తాయి. బదులుగా, సిబ్బంది శరీరాన్ని భూమికి తిరిగి వచ్చే వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచవచ్చు.