Chinese Firms Rules: 



చైనాలోని కంపెనీలో రూల్..


చైనాలోని ఝెజియాంగ్‌లోని ఓ కంపెనీ వింత రూల్స్ పెట్టి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఎంప్లాయిస్‌లో ఎవరైనా సరే...వివాహేతర సంబంధం పెట్టుకుంటే బయటకు గెంటేస్తామని తేల్చి చెప్పింది. కుటుంబ విలువలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జూన్ 9వ తేదీన వివాహేతర సంబంధంపై నిషేధం విధిస్తూ ఓ సర్క్యులర్ పాస్ చేసింది. పెళ్లైన స్టాఫ్‌ అందరికీ ఇది వర్తిస్తుందని వెల్లడించింది. అప్పటికే కొందరిని కంపెనీ నుంచి బ్యాన్ చేసింది. ఫలితంగా...చైనాలోని సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతోంది. అటు కంపెనీ మాత్రం రూల్ గురించి అందరికీ వివరిస్తోంది. 


"కంపెనీ మేనేజ్‌మెంట్‌ని బలోపేతం చేయడానికి, కుటుంబ విలువలకు కట్టుబడి ఉండడంతో పాటు కుటుంబ సభ్యులతో నిజాయతీగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రూల్ తీసుకొచ్చాం. భార్యాభర్తల మధ్య బంధం బలపడడానికీ ఇది ఉపయోగపడుతుంది. ఫ్యామిలీని చూసుకుంటూనే పనిపై శ్రద్ధ పెట్టాలనేదే మా లక్ష్యం. పెళ్లైన ఉద్యోగులందరూ ఇది మనసులో పెట్టుకుని నడుచుకోవాలి. ఎవరు నిబంధన ఉల్లంఘించినా ఉద్యోగం ఊడుతుంది. అందరూ ప్రేమకు విలువనివ్వాలి. మంచి ఉద్యోగులుగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇల్లీగల్ అఫైర్స్‌కి నో చెప్పండి. విడాకులకూ దూరంగా ఉండండి. "


- కంపెనీ మేనేజ్‌మెంట్ 


ఇదీ విషయం..


అయితే..ఈ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి స్థానిక మీడియాకి కీలక విషయాలు చెప్పాడు. కుటుంబంలో ఎలాంటి విభేదాలు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఉద్యోగుల కుటుంబంలో సమస్యలొస్తే...అది కంపెనీ ప్రొడక్టివిటీపైనా ప్రభావం చూపిస్తుందని వివరించాడు. కంపెనీలో కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారని తెలిసే...యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే ఈ డిసిషన్‌పై పెద్ద డిబేట్ నడుస్తోంది. 


టైమ్‌ని రెంట్‌కి ఇస్తున్న చైనా యువతి..


సాధారణంగా కొంత మంది ఒంటరిగా షాపింగ్‌కి వెళ్లాలన్నా, మరేపనిమీద బయటకెళ్లాలన్నా పెద్దగా ఆసక్తి చూపించరు. బోర్ ఫీల్ అవుతారు. ఎవరైనా తోడుగా వస్తే బాగుండు అనుకుంటారు. అదిగో అలాంటి వాళ్లకు తన టైమ్‌ని అద్దెకి ఇస్తోంది 26 ఏళ్ల ఓ యువతి. భలే ఉంది కదా ఐడియా. అలా వాళ్లతో షాపింగ్‌కో, లేదంటే సరదాగా సినిమాకో వెళ్తుంది. ఫ్రీగా కాదు. గంటకు ఓ యువాన్ ఇచ్చుకోవాల్సిందే. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ.11 అన్నమాట. అంటే గంటకు రూ.11 ఇస్తే చాలు ఎన్ని గంటలైనా మనతోపాటు ఉంటుంది. 26 ఏళ్ల పెగ్గీ అనే యువతి ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో ఓ సంచలనం. గత నెలలోనే ఈ కొత్త ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది. ఈ వింత వ్యాపారానికి ఫుల్ డిమాండ్ పెరిగిపోయిందట. "ఒంటరిగా వెళ్లలేని వాళ్లకు, అలా వెళ్లేందుకు భయపడే వాళ్లకు నేను తోడుగా ఉంటాను. అదే నా జాబ్" అని వివరిస్తోంది పెగ్గీ. అలా చేయడం వల్ల అవతలి వాళ్లు ఒంటరితనం నుంచి బయటపడతారని తన ఐడియా వెనక ఉన్న ఫిలాసఫీనీ చెబుతోంది. ఈ మధ్యే ముగ్గురు గ్రాడ్యుయేట్‌లు తన ఐడియాకి అట్రాక్ట్‌ అయ్యి రెంట్‌ ఇచ్చేందుకు ఒప్పుకున్నారట. వాళ్లతో కలిసి ఎంచక్కా ట్రెకింగ్ కూడా వెళ్లొచ్చింది. 


Also Read: Bronze Sword: తవ్వకాల్లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి కంచు ఖడ్గం, ఇప్పటికీ అదే మెరుపు