Canada Road Accident: వ్యాన్‌ను ఢీ కొట్టిన ట్రాలీ- ఐదుగురు భారత విద్యార్థులు మృతి

ABP Desam   |  Murali Krishna   |  14 Mar 2022 03:36 PM (IST)

Canada Road Accident: కెనడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం

కెనడాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందారు. ఒంటారియో హైవేపై టొరొంటో వద్ద ఓ పాసింజర్ వ్యాన్‌ను ట్రాలీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

ఏడుగురు భారత విద్యార్థులు ఓ వ్యాన్‌లో ప్రయాణం చేస్తుండగా ఓ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భారత విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రాలీ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ విషయాన్ని కెనడాలో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారికి కెనడాలోని భారత రాయబార కార్యాలయం అన్నివిధాల అండగా ఉందన్నారు.

టొరొంటో వద్ద శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారత కాన్సులేట్ జనరల్ టీమ్.. మృతుల కుటుంబాలు, స్నేహితులకు అండగా ఉంది.                                                      - అజయ్ బిసారియా, కెనడాలో భారత హైకమిషనర్ 

మృతులు వీరే

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని హర్‌ప్రీత్ సింగ్ (24), జస్పిందర్ సింగ్ (21), కరణ్‌పాల్ సింగ్ (22), మోహిత్ చౌహాన్ (23), పవన్ కుమార్ (23)గా క్వింటే వెస్ట్ ఒంటారియో ప్రొవీన్స్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దిగ్భ్రాంతి

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయ్‌శంకర్ స్పందించారు. ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు భారత్ అండగా ఉంటుందన్నారు.

Also Read: Pak No Confidence Motion: ఆలూ, టమాటా ధరలు తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్

Published at: 14 Mar 2022 03:28 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.