British Soldiers Faint: 



ముగ్గురు సైనికులకు అస్వస్థత..


బ్రిటన్‌లో ప్రిన్స్ విలియమ్ ముందు కలర్‌ పరేడ్ నిర్వహించే క్రమంలో ముగ్గురు సైనికులు కళ్లు తిరిగి కింద పడిపోయారు. ఎండ ధాటిని తట్టుకోలేక నిలబడిన చోటే కుప్ప కూలిపోయారు.  Fox News ఈ విషయం వెల్లడించింది. అంత ఎండలోనూ యూనిఫామ్స్‌ వేసుకోవడం, పైగా హ్యాట్‌లు ధరించడం చాలా ఇబ్బందికి గురి చేసింది. ప్రస్తుతం అక్కడ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డీహైడ్రేట్ అయిన ముగ్గురు సైనికులు ఇలా పడిపోయారు. అయినా...పరేడ్ కొనసాగింది. కొందరు సైనికులు వచ్చి స్ట్రెచర్‌పై ముగ్గురినీ తీసుకెళ్లారు. ఈ పరేడ్‌పై ప్రిన్స్ విలియమ్ స్పందించాడు. అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ పరేడ్ సక్సెస్‌ఫుల్‌గా చేశారని ప్రశంసలు సైనికులపై కురిపించారు. 


"కల్నల్స్‌ రివ్యూలో కలర్ పరేడ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క సైనికుడికీ నా ధన్యవాదాలు. అంత కష్టమైన పరిస్థితులున్నా అద్భుతంగా పరేడ్ చేశారు. ఇంత హార్డ్‌ వర్క్ చేసి రిహార్సల్స్ చేయడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ ఇవ్వాల్సిందే. థాంక్యూ"


- ప్రిన్స్ విలియమ్స్ 






పరేడ్ జరుగుతుండగానే ముగ్గురు సైనికులు కిందపడిపోగా..ఇతర సైనికులు వచ్చి వాళ్లను ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అలెర్ట్ ప్రకటించింది. సౌత్ ఇంగ్లాండ్‌లో వేడి గాలులు వీచే ప్రమాదముందని హెచ్చరించింది.