Watch Video: 


కర్ణాటకలో బైక్ రైడ్ 


కర్ణాటక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఓ వైపు భారీ బహిరంగ సభలతో హోరెత్తిస్తుంటే..ఇటు కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రచారం చేసే క్రమంలో ఓ డెలివరీ ఏజెంట్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు రాహుల్. కాసేపు అక్కడి వాళ్లతో మాట్లాడి వెంటనే హెల్మెట్ పెట్టుకుని ఆ డెలివరీ ఏజెంట్ స్కూటీ ఎక్కారు. ఇది చూసి షాక్ అయిన ఆ వ్యక్తి రాహుల్‌ని చూసి నవ్వాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి కొంత దూరం వరకూ ప్రయాణించాడు. అలా వెనకాలే కూర్చుని కాసేపు రైడ్ చేశారు రాహుల్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటికప్పుడు హెల్మెట్ పెట్టుకుని బైక్ ఎక్కడాన్ని చూసి చుట్టూ ఉన్న సెక్యూరిటీ కూడా షాక్ అయింది. వెంటనే అలెర్ట్ అయ్యి బైక్‌ను వెంబడించారు బాడీగార్డ్‌లు. కొంత దూరం వరకూ అలానే పరిగెత్తారు. అయితే...కాసేపే అలా రైడ్ చేస్తారనుకుంటే...ఏకంగా 2 కిలోమీటర్ల వరకూ అలానే ప్రయాణించారు రాహుల్. ఆయన ఉండే హోటల్ వరకూ అలా బైక్‌పైనే వెళ్లారు. సాధారణంగా రాహుల్ ప్రచారం గతంలో సాదాసీదాగా సాగేది. కానీ భారత్ జోడో యాత్ర తరవాత ఆయన క్యాంపెయినింగ్ స్టైల్‌లో మార్పు కనిపిస్తోంది. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో చాలానే మారారు. అందుకు ఈ స్కూటర్ రైడే ఉదాహరణ.