Viral Video: 


రూ.500 నోట్ల వర్షం..


సోషల్ మీడియా. ఇప్పుడిదే అందరి ప్రపంచం. జస్ట్ అలా ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు. బోలెడంత కంటెంట్. వీడియోలైతే చెప్పనవసరం లేదు. స్క్రోల్ చేస్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని విపరీతంగా వైరల్ అవుతాయి. మొన్నా మధ్య బెంగళూరులో ఓ వ్యక్తి బ్రిడ్జ్‌ పై నుంచి నోట్ల వర్షం కురిపించిన వీడియో చాలా రోజుల పాటు వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుజరాత్‌లోని మెషనా జిల్లాలో ఓ మాజీ సర్పంచ్‌ తన ఇంటి డాబాపై నుంచి నోట్ల వర్షం కురిపించాడు. ఎన్ని లక్షలు అలా పై నుంచి నోట్లు విసురుతూనే ఉన్నాడు. తన మేనల్లుడికి పెళ్లి జరుగుతోందన్న సంతోషంలో ఇలా చేశాడు. కెర్రీ తహసీల్లోని అగోల్ గ్రామంలో తన మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ కరీమ్ యాదవ్ ఊరేగింపు నిర్వహించాడు. ఆ సమంలోనే బిల్డింగ్‌పై నిలబడి రూ.500 విలువైన నోట్లను ప్రజలపై విసిరాడు. దాదాపు రూ.5 లక్షలు ఇలా విసిరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. జోధా అక్బర్‌లోని అజీమ్ ఓ షాన్ షెహన్‌షా అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతోంది. పైన నిలబడి ఆ వ్యక్తి పూలు జల్లినంత సింపుల్‌గా నోట్లు చల్లుతూ కనిపించాడు.