మహిళా సాధికారత అనేది చేసి చూపాం. 50% పదవులు మహిళలకే ఇచ్చాం. వైద్య రంగంలో విప్లవాత్మక‌ మార్పులు తెచ్చాం.  విద్యారంగంలో నాడునేడుతో స్కూళ్ల అభివృద్ధి చేశాం. చంద్రబాబు తెచ్చిన పథకం చెప్పుకోవటానికి ఒక్కటీ లేదు. మహానాడులో తొడలు కొట్టిస్తున్నాడు. జనంతో బూతులు తిట్టిస్తున్నారు. టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ.  తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదు, చంద్రం బూతుల నాయుడు.  ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం. మిగతావారు తిడుతుంటే చంద్రబాబు ఆనందం పొందుతున్నారు.  చంద్రబాబు ఏడ్చినా సింపతీ రాదు.  చంద్రబాబు తన కొడుకును నమ్మటంలేదు కానీ, దత్తపుత్రుడునే నమ్ముకుంటున్నారు.  చంద్రబాబు తనకుతాను అపరచాణక్యుడు అనుకుంటున్నారు. కానీ ఆయన్ను జనం ఇంటికి పంపారన్నది తెలుసుకోవటం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన మనుషులకు తప్ప మరెవరూ బాగుజరగదు. కానీ జగన్ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంది. - -విజయసాయిరెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి