Harish Rawat on POK: మోదీజీ, ఇదే సరైన టైమ్- పీఓకేను లాగేసుకోండి: మాజీ సీఎం

ABP Desam Updated at: 05 Dec 2022 11:16 AM (IST)
Edited By: Murali Krishna

Harish Rawat on POK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దక్కించుకునేందుకు మోదీ సర్కార్‌కు ఇదే సరైన సమయమని ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ అన్నారు.

హరీశ్ రావత్ (File Photo)

NEXT PREV

Harish Rawat on POK: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. కేంద్ర ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. మోదీ ప్రభుత్వం.. పాకిస్థాన్ నుంచి పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వెనక్కి తీసుకోవాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తీసుకోవడం మన కర్తవ్యమని ఆయన అన్నారు.







పీఓకేను వెనక్కి తీసుకోవడం మన కర్తవ్యం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించాం. ఇది మోదీ ప్రభుత్వ అజెండాలో ఉండాలి. ప్రస్తుతం పాకిస్థాన్ బలహీనమైన స్థితిలో ఉంది. కనుక మనం దానిని వెనక్కి తీసుకునేందుకు ఇదే సరైన సమయం.                                                         -   హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం


పాకిస్థాన్


పాకిస్థాన్‌కు కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతి ఇంచు భూమిని రక్షించుకోవడమే కాకుండా శత్రుదేశంపై దాడి చేస్తామని భారత్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు.


బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నియంత్రణ రేఖలోని (Line of Control) రాఖ్‌చిక్రీ సెక్టార్‌లో మునీర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులు, ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



గిల్గిత్‌-బాల్టిస్థాన్‌తో పాటు జమ్ముకశ్మీర్‌పై భారత్‌ ఇటీవల బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేసింది. వాటిని మేము గమనించాం. మా మాతృభూమిలో ప్రతి అంగుళాన్ని రక్షించుకోవడమే కాకుండా.. శత్రువులు మాపై దాడిచేస్తే తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.                                                        "
-అసిమ్ మునీర్, పాకిస్థన్ ఆర్మీ చీఫ్



నియంత్రణ రేఖలో పర్యటన సందర్భంగా అక్కడి సైనికులు, ఆఫీసర్లతో మునీర్ మాట్లాడారు. ఎల్‌ఓసీలో నెలకొన్న తాజా పరిస్థితులు, కార్యాచరణ సంసిద్ధత, భారత్‌ ప్రకటనలపై సైనికాధికారులతో చర్చించారు. జనరల్‌ కమర్‌ జవేద్‌ బజ్వా పదవీ విరమణ అనంతరం నవంబర్‌ 24న పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా అసీమ్‌ మునీర్‌ నియమితులయ్యారు.


Also Read: Gujarat Election 2022: 'ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుందాం'- ఓటేసిన మోదీ

Published at: 05 Dec 2022 11:14 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.