ఉద్యమకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009 డిసెంబర్ 09 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన అన్ని కేసుల వివరాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీలను అడిషనల్ డీజీపీ (సీఐడీ) శుక్రవారం ఆదేశించారు. ఇప్పటికే తొలి కేబినెట్ భేటీలో హామీల అమలుపై చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరించి, కేసులన్ని ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.