Rashtriya Bal Puraskar 2022: 'దేశమే మీ తొలి ప్రాధాన్యం కావాలి..' జాతీయ బాల పురస్కారాలు ప్రదానం

ABP Desam   |  Murali Krishna   |  24 Jan 2022 05:02 PM (IST)

జాతీయ బాల పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు అందించారు. అవార్డు గెలిచిన వారికి మెడల్‌తో పాటు రూ.లక్ష నగదు బహుమతి కూడా ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ

2021, 2022 సంవత్సరాలకు గాను ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాలను నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. అవార్డ్ గ్రహీతలతో మాట్లాడి.. బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ సర్టిఫికెట్​లను అందించారు.

ఈ ఏడాదికి 29 మంది పిల్లలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఆయా జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. వోకల్ ఫర్ లోకల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని బాలలకు ప్రధాని సూచించారు. అవార్డు గెలిచిన బాలలకు మెడల్‌తో పాటు రూ.లక్ష నగదు బహుమతి, సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాకుండా పిల్లలతో ప్రధాని ముచ్చటించారు. వారు సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. జీవితంలో మరిన్న విజయాలు సాధించాలని ఆశించారు.

ఎవరికైనా దేశమే తొలి ప్రాధాన్యమన్న విషయాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి మీరు నేర్చుకోవాలి. మీరు ధైర్యంగా ముందడుగు వేయాలి. కరోనా టీకా పంపిణీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా చిన్నారులు టీకా తీసుకున్నారు. ఇదే ఉత్సాహాన్ని అన్ని విషయాల్లోనూ కొనసాగించాలి. కేంద్రం ప్రవేశపెడుతున్న అన్ని విధానాలు యువతను దృష్టిలో ఉంచుకొనే తీసుకొస్తున్నాం. భారత్​కు చెందిన యువత.. విదేశాల్లోనూ. ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు.                                                       -      ప్రధాని నరంద్ర మోదీ

దేశంలో ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ పురస్కారాలను ఇస్తారు. నూతన ఆవిష్కరణలు, క్రీడలు, శౌర్యపరాక్రమాలు, సాంస్కృతిక కళలు, సామాజిక సేవ, పాండిత్యం రంగాల్లో విజేతలకు ఈ బహుమతులు ప్రదానం చేస్తారు.

Also Read: Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 24 Jan 2022 05:00 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.