Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పార్లమెంటు మెట్లు దిగుతుండగా గురువారం జారిపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఈ ఘటన జరిగింది.
జారిపడటంతో శశిథరూర్ ఎడమ కాలి మడమ బెణికింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్నందున నియోజవర్గ పరిధిలో తాను హాజరుకావాల్సి ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు శశిథరూర్ ట్వీట్ చేశారు. కాలికి పాస్లర్ వేసి ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
తవాంగ్ ఘర్షణపై
భారత్- చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణపై శశిథరూర్ స్పందించారు. చైనా విషయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యవహరించిన తీరుని గుర్తు చేశారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్లో జవాబుదారీతనం ఉండాలని శశిథరూర్ అన్నారు. జాతీయ భద్రత అంశమైనా, అందులో కొన్ని రహస్యంగా ఉంచాల్సినవైనా...కొన్నింటిపై మాత్రం తప్పకుండా చర్చించే అవకాశం కల్పించాలని సూచించారు. రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని థరూర్ అన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఏదో పొడిపొడిగా వివరణ ఇచ్చారని..ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండి పడ్డారు.
Also Read: Viral Video: మంచులో ఒంటె ఎంజాయ్మెంట్ మామూలుగా లేదుగా!