PM Modi: 'వారితో జాగ్రత్త.. మానవ హక్కుల పేరుతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర'

ABP Desam   |  Murali Krishna   |  12 Oct 2021 05:53 PM (IST)

మానవ హక్కుల పేరుతో కొంతమంది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

వారితో జాగ్రత్త.. మానవ హక్కుల పేరుతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర

28వ జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కుల పేరుతో కొంతమంది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారని వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు.

స్వప్రయోజనాలు, రాజకీయ లాభం కోసం మానవ హక్కులను వాడుకునే కొందరి విధానాలు ప్రజాస్వామ్యానికి హానికరం. మా ప్రభుత్వం మానవ హక్కులను కాపాడేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం ద్వారా ముస్లిం మహిళలకు కొత్త హక్కులు కల్పించాం. మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవు, అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టాలను రూపొందించాం.                                                          - ప్రధాని నరేంద్ర మోదీ

గత కొన్నేళ్లుగా దేశంలోని అసమానతలను రూపుమాపేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని మోదీ అన్నారు. తాము ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చి ముస్లిం మహిళలకు కొత్త హక్కులను అందించామన్నారు. 

ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 12 Oct 2021 05:50 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.