Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ

ABP Desam Updated at: 20 Oct 2021 05:55 PM (IST)
Edited By: Murali Krishna

ప్రియంక గాంధీని యూపీ పోలీసులు నిర్బంధించారు. ఓ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ఆగ్రా వెళ్తోన్న ప్రిాయంకను మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు.

ప్రియాంక గాంధీని నిర్బంధించిన యూపీ పోలీసులు

NEXT PREV

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని.. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆగ్రాలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని కలవడానికి వెళ్తున్న ప్రియాంకను మార్గ మధ్యంలో పోలీసులు నిలిపివేశారు.

  







లఖ్‌నవూలో సెక్షన్ 144 అమల్లో ఉంది. కనుక ఆమెను ఆగ్రా వెళ్లేందుకు అనుమతించం. అయినప్పటికీ ఆమె వెళ్లేందుకు ప్రయత్నించారు. కనుక అదుపులోకి తీసుకున్నాం.                                        -  యూపీ పోలీసులు


అంతకుముందు ప్రియాంక గాంధీని లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఉన్న మొదటి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్రియాంక గాంధీని అడ్డుకోవడంపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణ పడినట్లు సమాచారం. అయితే తనను అదుపులోకి తీసుకోవడంపై ప్రియాంక గాంధీ.. యూపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 



బాధిత కుటుంబాన్ని కలిసేందుకు నేను ఆగ్రా వెళ్లాలనుకుంటున్నాను. కానీ ప్రతిపక్ష నేతలు ఎక్కడికైనా వెళ్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. నేను ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే చాలు.. నన్ను అడ్డుకుంటున్నారు. దీని వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. -  ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి




అనంతరం తనని అడ్డుకోవడంపై ప్రియాంక ట్వీట్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.











అరుణ్ వాల్మీకి పోలీసుల కస్టడీలో చనిపోయాడు. నేను బాధిత కుటుంబాన్ని కలవాలనుకుంటున్నాను. దీనికి ఎందుకు యూపీ సర్కార్ భయపడటం? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈరోజు వాల్మీకి జయంతి. మోదీ.. బుద్ధుడి గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఇది ఆయన మాటపై జరుగుతోన్న దాడి కాదా? నేను లఖ్‌నవూ వచ్చిన ప్రతిసారి ఎవరి అనుమతైనా తీసుకోవాలా? నన్ను ఆగ్రా వెళ్లకుండా అడ్డుకోవడానికి కారణమేంటి? శాంతి భద్రతల సమస్య ఏమైనా ఉందా? నేను రెస్టారెంట్‌లలోనే కూర్చోవాలా? రాజకీయాలు చేయకూడదా?                                                       -  ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి






దొంగతనం ఆరోపణలు..


ఆగ్రాలో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడు రూ.25 లక్షలు దొంగతనం చేసినట్లు అభియోగాలు వచ్చాయి. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి, తన ఇంటి వద్ద తనిఖీ చేశారు. ఆ సమయంలో నిందితుడి హఠాత్తుగా కింద పడిపోయాడని.. ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు ఆగ్రా ఎస్పీ తెలిపారు.


Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం


Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 20 Oct 2021 05:50 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.