Parliament Monsoon Session LIVE Updates: ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాలు ఓకే.. చర్చలో పాల్గొనేందుకు అంగీకారం

ఓబీసీ బిల్లుకు పూర్తిగా సహకరిస్తామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ఈ రోజు ఓబీసీ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

ABP Desam Last Updated: 09 Aug 2021 12:24 PM
ఆ బిల్లుకు ఆమోదం..

షెడ్యూల్డ్ ట్రైబ్స్ రాజ్యాంగ సవరణ బిల్లు 2021కి లోక్ సభ ఆమోదం తెలిపింది. 1950లో వచ్చిన ఈ చట్టంలో నేడు సవరణలు చేశారు. తమ రాష్ట్రాల్లోని వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడం ఈ బిల్లు లక్ష్యం.

రాజ్యసభ వాయిదా..

పెగాసస్ వ్యవహారంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభలో నిరసన చేశాయి. దీంతో రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు.

ఓబీసీ బిల్లుకు సహకరిస్తాం: మల్లిఖార్జున ఖర్గే

ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాలు అన్నీ సహకరిస్తాయి


       - మల్లి ప్రతిపక్షనేత


Background

పెగాసస్‌ సహా పలు అంశాలపై ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు.. ఒక్క బిల్లుకు మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. నేడు ప్రవేశపెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని వెల్లడించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు చెప్పారు. 


రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే భాజపా కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.