New Parliament Opening: 


ట్వీట్‌తో విమర్శలు..


పార్లమెంట్ ప్రారంభోత్సవంపై కొన్ని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌తో సహా దాదాపు 20 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేశాయి. ప్రధాని మోదీ పార్లమెంట్‌ని ప్రారంభించిన వెంటనే విపక్ష పార్టీలకు చెందిన నేతలు వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. విమర్శలతో విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఓ ట్వీట్ చేశారు. పార్లమెంట్ దేశ ప్రజల గొంతుక అని వెల్లడించారి. ప్రధాని మాత్రం...ఈ కార్యక్రమాన్ని పట్టాభిషేకంలా చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ మధ్య కాలంలో ప్రధానిపై తీవ్ర విమర్శలు చేస్తున్న రాహుల్..సందర్భం దొరికినప్పుడల్లా మోదీని టార్గెట్ చేస్తున్నారు.  


"పార్లమెంట్ అంటే దేశ ప్రజల గొంతుక. వాళ్ల స్వరం వినిపించే వేదిక. కానీ..ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంలా జరుపుకుంటున్నారు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత