Rajnath Singh on Rahul Gandhi: 


పార్లమెంట్‌లో రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలైన కాసేపటికీ రెండు సభలనూ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. యూకేకు వెళ్లి అక్కడ భారత్‌ గురించి తక్కువ చేసి మాట్లాడతారా అంటూ మండి పడ్డారు. పార్లమెంట్ సభ్యుడైన రాహుల్.. లండన్‌లో భారత్‌ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేయడం వల్ల సభ సజావుగా ముందుకెళ్లలేదు. ఫలితంగా వెంటనే వాయిదా వేశారు. 


"పార్లమెంట్ సభ్యుడైనా రాహుల్ గాంధీ లండన్‌లో భారత్ ప్రతిష్ఠను దిగజార్చారు. సభలోని వాళ్లంతా ఆ వ్యాఖ్యల్ని ఖండించాలని డిమాండ్ చేస్తున్నాను. రాహుల్ అందరికీ క్షమాపణలు చెప్పాల్సిందే"


- రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి