హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో విషాదం. కొండచరియలు విరిగిపడి దిల్లీకి చెందిన 9 మంది పర్యటకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.


వీరంతా టెంపోలో ఉండగా పెద్ద బండరాయి వచ్చి వాహనాన్ని ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. ఇదే ప్రమాదంలో మరో చోట ఇంకో వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో రాజస్థాన్​కు చెందినవారు నలుగురు, ఛత్తీస్​గఢ్-​ ఇద్దరు, మహారాష్ట్ర- ఒకరు, దిల్లీ- ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.



భూకంపం సంభవించినట్లుగా ఒక్కసారిగా కొండ పైనుంచి బండరాళ్లు వేగంగా కిందకు దూసుకొచ్చాయి. రాళ్ల ధాటికి లోయలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పర్యటకుల విశ్రాంతి గదులు ధ్వంసం అయ్యాయి. ఈ దృశ్యాలను పలువురు పర్యటకులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.