Nara Lokesh on CM Jagan: ముస్లిం మైనార్టీలను అంతంమొందించేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. నరసారావుపేట మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న టీడీరీ నేత షేక్ ఇబ్రహీంను పట్టణవాసులంతా చూస్తుండగా అత్యంత కిరాతకంగా హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకు పరాకాష్ట అని తెలిపారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త అలీ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అది ముమ్మాటికీ వైసీపీ సర్కారు స్పాన్సర్డ్ మర్డర్లేనంటూ ట్వీట్ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఉసురు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పడు ఇబ్రహీం సాబ్ ని చంపేశారంటూ ఫైర్ అయ్యారు. "జగన్ గారు.. మీ ధనదాహం, రక్తదాహం తీరదా?" అంటూ ప్రశ్నించారు. 










ఇబ్రహీంని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారిని,అసలు సూత్రధారులైన వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు. మృతుడి కుటుంబానికి, దాడిలో గాయపడిన అలీకి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మా పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందన్నారు.