మహారాష్ట్ర ముంబయి బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కూలింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు.

Continues below advertisement






ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


Also Read: Bihar: ఇద్దరు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో అక్షరాలా రూ.900 కోట్లు!.. ఎలా వచ్చాయో తెలుసా?


ప్రాణం నష్టం లేదు


ఈ సంఘటన తెల్లవారుజామున 4:40 గంటలకు జరిగిందని అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ బీకేసీ ప్రధాన రహదారిని శాంతా క్రజ్-చెంబూర్ లింక్ రోడ్‌తో కలుపుతుందన్నారు. "ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ తప్పిపోలేదు" అని పోలీసు డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ సింగే అన్నారు. విపత్తు నిర్వహణ సెల్ సమాచారం ప్రకారం నిర్మాణ పనులను ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) చేపట్టింది.


Also Read: Revant Audio Leak : శశిథరూర్‌పై రేవంత్ లూజ్ టాక్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !