Delhi MCD Election Results 2022: ప్రధాని మోదీ ఆశీర్వాదం ఉంటేనే అది సాధ్యం: కేజ్రీవాల్

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 07 Dec 2022 03:48 PM (IST)

Delhi MCD Election Results 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు.

(Image Source: ANI)

NEXT PREV

Delhi MCD Election Results 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ (AAP) పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) ప్రజలనుద్దేశించి మాట్లాడారు. విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆశీర్వాదాలు కావాలని కేజ్రీవాల్ అన్నారు.

Continues below advertisement







ఈ విజయం అందించిన దిల్లీ ప్రజలను అభినందిస్తున్నాను. మార్పు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు దిల్లీ కోసం పని చేయడానికి భాజపా, కాంగ్రెస్ సహకారం నేను కోరుతున్నాను. నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దిల్లీని మెరుగుపరచడానికి ప్రధాన మంత్రి ఆశీస్సులు కోరుతున్నాను. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలి. ఈ రోజు దిల్లీ ప్రజలు యావత్ దేశానికి సందేశం ఇచ్చారు.           -   అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం


MCD ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.


ఇది బాధ్యత



ఆప్‌కి విజయాన్ని ఇచ్చినందుకు దిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, దిల్లీని క్లీనర్‌గా, మెరుగ్గా మార్చే పెద్ద బాధ్యత                 -  దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా


250 స్థానాలున్న దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆప్ 134 వార్డులను కైవసం చేసుకుంది. భాజపా (BJP) 104 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ (Congress) కేవలం 9 స్థానాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది.






Also Read: Delhi MCD Election Results: దిల్లీని మరోసారి ఊడ్చేసిన కేజ్రీవాల్- భాజపా 15 ఏళ్ల జైత్రయాత్రకు తెర


 

Published at: 07 Dec 2022 03:38 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.