Fire Accident in Raipur: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోటా ప్రాంతంలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడుతో మంటలు వ్యాపించాయి. కరెంట్ ఆయిల్ ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడం వల్ల ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే...ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా అన్న వివరాలు ఇంకా తెలియలేదు. 






కంపెనీ ప్రాంగణంలో కరెంట్ ఆయిల్‌ ఉండడం వల్ల ఈ స్థాయిలో ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇది గమనించి వెంటనే లోపల ఉన్న ఆయిల్ బ్యారెల్స్‌ని బయటకు తీసుకొచ్చారు. ఇతరత్రా సామగ్రిని అక్కడ నుంచి తొలగించారు.