బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయంలోని 14వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 14వ అంతస్తు నుంచి దట్టంగా పొగ రావడం గమనించిన కార్యాలయ సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చారు.


ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దుర్గా పూజ సందర్భంగా సచివాలయానికి సెలవు కావడం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.