Mamata Suvendu Meet: ఆ ఓటమి తర్వాత తొలిసారి సువేందుతో దీదీ భేటీ!

ABP Desam Updated at: 25 Nov 2022 05:16 PM (IST)
Edited By: Murali Krishna

Mamata Suvendu Meet: బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భాజపా నేత సువేందు అధికారితో భేటీ అయ్యారు.

ఆ ఓటమి తర్వాత తొలిసారి సువేందుతో దీదీ భేటీ!

NEXT PREV

Mamata Suvendu Meet: ప్రస్తుతం ఉప్పు- నిప్పుగా ఉన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి శుక్రవారం సమావేశమయ్యారు. గత ఏడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించిన తర్వాత వీరు ఇరువురూ ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి. 


మమతా బెనర్జీ.. భాజపా నేత సువేందును బంగాల్ అసెంబ్లీలో ఈ శుక్రవారం కలిశారు. సమాచారం ప్రకారం మమతా.. సువేందు అధికారిని కలవాలని వర్తమానం పంపడంతో వారి మధ్య ఈ సమావేశం జరిగింది. దాదాపు 2 నిమిషాల పాటు ఇది కొనసాగింది. సువేందుతోపాటు భాజపా ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మనోజ్ టిగ్గా కూడా హాజరయ్యారు.




దీదీ ఏమన్నారంటే


ఇటీవల జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం గురించి మమతా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భాజపా గైర్హాజరైంది.





మీ అందర్ని గవర్నర్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆహ్వానించాం. మీరు ఎవరూ హాజరు కాలేదు. వామ పక్ష నేత బిమొన్ బోస్ హాజరయ్యారు, ఆయనకి నా ధన్యవాదాలు. వామ పక్షాల హయాంలో విద్యాశాఖను పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు, విద్యాశాఖ మంత్రికి పని చేయడం కష్టంగా ఉండేది. వాటి గురించి మీరెందుకు మాట్లాడరు. అభివృద్ధి గురించి ఎందుకు చర్చించరు.                                                   -   మమతా బెనర్జీ, బంగాల్ సీఎం


ఓటమి


గత ఏడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి పోటీ చేశారు. సువేందు అధికారి.. మమతాపై విజయం సాధించారు. తొలుత ట్రెండ్స్‌లో సువెందు అధికారి 1200 ఓట్లు వెనుకంజలో ఉండగా.. చివర్లో పుంజుకొని 1900 ఓట్ల ఆధిక్యంతో మమతా బెనర్జీపై విజయం సాధించారు.


Also Read: Saudi Arabia Floods: ఎడారి దేశంలో వరద బీభత్సం- 13 ఏళ్ల నాటి సీన్‌ రిపీట్‌!

Published at: 25 Nov 2022 05:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.