Maharashtra Assembly Session: చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే 

ABP Desam   |  Murali Krishna   |  19 Dec 2022 05:38 PM (IST)

Maharashtra Assembly Session: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఎన్‌సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన చంటి బిడ్డతో సమావేశాలకు హాజరయ్యారు.

చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే 

Maharashtra Assembly Session: మహారాష్ట్రలో సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాల్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన నాసిక్ నియోజకవర్గ ఎమ్మెల్యే సరోజ అహిరే తన రెండున్నర నెలల పసికందుతో అసెంబ్లీకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఇదీ సంగతి

చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేతో పాటు తన భర్త, అత్త కూడా చంటి బిడ్డను చూసుకోవడానికి అసెంబ్లీకి వచ్చారు. సభకు హాజరయ్యే ముందు ఎమ్మెల్యే సరోజ అహిరే విలేకర్లతో మాట్లాడారు.

గత రెండున్నర సంవత్సరాలుగా కరోనా వైరస్ సృష్టించిన విపత్తు కారణంగా మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. నేను ఇప్పుడు తల్లి అయినా.. నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రశ్నలకు సమాధానాల కోసం ఇక్కడకు వచ్చాను. అసెంబ్లీలో మహిళా చట్ట సభ్యులకు సరైన భోజన గది, క్రౌచ్ కూడా లేదు. ప్రభుత్వం దీనిని గమనించి.. శాసనసభ సభ్యులు వారి పిల్లలను తీసుకురావడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తే బావుంటుందని ఆశిస్తున్నాను.                                            -    సరోజ అహిరే, ఎన్‌సీపీ ఎమ్మెల్యే

దాదాపు రెండున్నర సంవత్సరాల తరవాత నాగపుర్‌లో మహరాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని భాజపా- శివసేన (ఏక్‌నాథ్ శిందే వర్గం) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు గత ఆదివారం జరిగిన సంప్రదాయ తేనేటి విందును బహిష్కరించాయి.

Also Read: Parliament Winter Session: చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్!

Published at: 19 Dec 2022 05:36 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.