Just In





Karnataka Election Results 2023: కర్ణాటక సక్సెస్ క్రెడిట్ అంతా రాహుల్కే, జోడో యాత్ర ఎఫెక్ట్ గట్టిగానే ఉందే!
Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల్లో సక్సెస్ క్రెడిట్ని కాంగ్రెస్ పూర్తిగా రాహుల్ గాంధీకే ఇచ్చేస్తోంది.

Karnataka Election Results 2023:
కర్ణాటకలో 21 రోజులు పర్యటన..
కర్ణాటక ఎన్నికలకు 7 నెలల ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మొదలు పెట్టారు. ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకున్న ఆయన కర్ణాటకలో దాదాపు 21 రోజుల పాటు పర్యటించారు. 2022 సెప్టెంబర్ 31వ తేదీ నుంచి అక్టోబర్ 19 వరకూ అక్కడే ఉన్నారు. మొత్తం 511 కిలోమీటర్ల మేర యాత్ర కవర్ చేశారు. 7 జిల్లాల్లో పర్యటించారు. చామరాజనగర్ నుంచి యాత్రను మొదలు పెట్టిన రాహుల్...ప్రజలతో మాట్లాడారు. ఇంటరాక్ట్ అయ్యే స్టైల్ని కూడా మార్చేశారు. ఈ యాత్రలో భాగంగా మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయ్చూర్ జిల్లాల్లో పర్యటించారు. ఆ తరవాత తెలంగాణలోకి ఎంటర్ అయ్యారు.
అనర్హతా వేటు కూడా కలిసొచ్చిందా..?
జోడో యాత్ర పార్టీ పరంగానే కాకుండా...రాహుల్ పర్సనల్ ఇమేజ్కి కూడా మంచి బూస్టప్ ఇచ్చింది. అంతకు ముందు కాంగ్రెస్కి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినా ఇప్పుడున్న ఫేమ్ అప్పుడు లేదు. సీనియర్లను పట్టించుకోలేదన్న విమర్శలూ అప్పట్లో ఎదుర్కొన్నారు రాహుల్. అసలు ఏ విషయంలోనూ బాధ్యత తీసుకోరు అన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక పార్టీ సంగతి సరే సరి. బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ క్లీన్స్వీప్ చేస్తూ దూసుకుపోతుంటే..కాంగ్రెస్ అన్నిచోట్లా ఓడిపోతూ వచ్చింది. అంతకంతకూ పార్టీ క్యాడర్ బలహీన పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ యాక్టివ్ అయ్యారు. పార్టీని మళ్లీ ట్రాక్లో పెట్టే బాధ్యత తీసుకున్నారు. తనకున్న నెగటివ్ ఇమేజ్ని పోగొట్టుకోటానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే భారత్ జోడో యాత్ర చేపట్టారు.