Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana)లో శనివారం గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. తెలంగాణలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) 65గా నమోదైంది. ఈ గాలి నాణ్యత వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే తీవ్ర శ్వాస కోస సమస్యలు ఉన్న వారికి కాస్త ఇబ్బందులు తప్పవు. బెల్లంపల్లిలో గాలి నాణ్యత మరింతగా పడిపోయింది. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కంటే ఎక్కువగా బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ 117గా నమోదై ప్రమాద స్థాయికి చేరింది. రామగుండంలో కూడా వాయు నాణ్యత ప్రమాణం 115గా నమోదైంది. తెలంగాణలో గాలిలో  2.5 పీఎం దూళి కణాలు 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెల్లడించింది. తెలంగాణలో సూర్యోదయం 6.26 నిమిషాలకు జరిగింది. సూర్యాస్తమయం సాయంత్రం 6.26కు జరగనుంది. దేశంలో అధిక కాలుష్య నగరాల్లో ఒకటిగా కర్నూలు కూడా నిలవడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌ కంటే ఎక్కువగా కర్నూలులో కాలుష్యం నమోదవుతోందని... టాప్‌ టెన్‌లో కర్నూలు పదో స్థానంలో ఉందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెల్లడించింది. 


హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌(Hyderabad)లోనూ వాయు నాణ్యత ప్రమాణం 65గా నమోదైంది. ప్రజలు బయట పనులకు వెళ్లవచ్చని... వాతావరణం కాస్త మేఘావృతమైనా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెల్లడించింది. తెలంగాణలో ఆదివారం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 134గా నమోదు అయ్యే అవకాశం ఉంది. రానున్న వారం రోజుల పాటు వాయు నాణ్యత ప్రమాణాలు ఇంతే నమోదయ్యే అవకాశం ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఇలా....
 ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ప్రకారం వాయు నాణ్యత మెరుగ్గా ఉంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 45గా నమోదైంది. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో వాయు నాణ్యత చాలా మెరుగ్గా ఉంది. ఏ ఒక్క ప్రాంతంలోనూ వాయు నాణ్యత ప్రమాణం 100 దాటలేదు. చాలా ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ చాలా మెరుగ్గా ఉంది. ఎక్కువ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగ్గా ఉంది. అసలు వాయు కాలుష్యం అతి తక్కువ ఉన్న నగరాల్లో పుంగనూరు టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకుంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెల్లడించింది. వచ్చే వారంలోనూ వాయు నాణ్యతలో పెద్దగా మార్పులు ఉండబోవని... ఆంధ్రలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ మెరుగ్గానే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత PM2.5 సాంద్రత 12గా ఉందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పీఎం 2.5 స్థాయి 15 కంటే ఎక్కువగా ఉంటే ప్రమాదమని తెలిపింది. ఆ లెక్కన హైదరాబాద్‌లో పీఎం స్థాయులు కూడా మెరుగ్గా ఉన్నట్లు ఏక్యూఐ తెలిపింది. గాలిలో PM 2.5 స్థాయి పెరిగితే ప్రమాదం తెచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. PM 2.5కంటే ఎక్కువగా ఉన్న గాలిని పీల్చుకోవడం వల్ల ఉబ్బసం, శ్వాస కోస సమస్యలు వస్తాయి. గుండె కొట్టుకోవడంలో కూడా మార్పులు వస్తాయి. వ్యాధులు ప్రబలే అవకాశం కూడా చాలా ఉంటుంది.


Also Read: