జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ఓ పోలీసుపై దాడికి తెగబడ్డారు. ఈ కాల్లుల్లో బంతో శర్మ అనే పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 






ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను పట్టుకుని తీరతామని అధికారులు తెలిపారు.


భారీగా ఆయుధాలు స్వాధీనం..


మరోవైపు పుల్వామా జిల్లా తాలంగం పోలీస్ స్టేషన్ పరిధిలో 182 సీఆర్‌పీఎఫ్, ఆర్ఆర్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్ట్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 4 పిస్టోళ్లు, 8 మేగజైన్ల తూటాలు, 60 రౌండ్ల 9ఎమ్ఎమ్ బుల్లెట్లు, 51 రౌండ్ల 7 ఎమ్ఎమ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో మరిన్ని ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.


Also Read: Covid 19 Vaccination: మోదీకి మరో గిఫ్ట్ రెడీ.. ఒక్కరోజులో 2 కోట్ల డోసులు పంపిణీ.. జెట్ స్పీడ్‌లో వ్యాక్సినేషన్!