Kashmiri Pandits:


ఆర్నెల్లుగా నిరసనలు..


కశ్మీరీ పండిట్‌లు ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. తమను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోడం లేదని మండి పడుతున్నారు. దాదాపు ఆర్నెల్లుగా కశ్మీరీ పండిట్‌లపై ఉగ్ర దాడులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యుగుల్లోని పండిట్‌లు అప్పటి నుంచి నిరసన బాట పట్టారు. దీనిపై జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్
గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "విధుల్లోకి హాజరు కాకుండా ఇలా ధర్నాల్లో కూర్చుంటే జీతాలు ఇవ్వం" అని తేల్చి చెప్పారు. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం కశ్మీరీ పండిట్‌ల భద్రతకు భరోసా ఇచ్చింది. అందరూ మళ్లీ కశ్మీర్‌కు రావచ్చని పిలుపునిచ్చింది. ప్రభుత్వంపై భరోసా ఉంచిన కశ్మీరీ పండిట్‌లు వరుసగా జమ్ముకశ్మీర్‌ బాటపట్టారు. కొద్ది రోజుల వరకూ బాగానే ఉన్నా...మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది. ఫలితంగా...వారిలో భయం పట్టుకుంది. స్పెషల్ ఎంప్లాయిమ్ంట్ స్కీమ్‌లో ఉద్యోగాలు లభించినప్పటికీ...ప్రశాంతత లేకుండా పోయిందని అంటున్నారు. దాదాపు 6 నెలలుగా కొందరు ఆఫీస్‌లకు వెళ్లడం లేదు. దీనిపైనే ఎల్‌జీ మనోజ్ సిన్హా అలా అసంతృప్తిగా మాట్లాడారు. "ఆగస్టు 31వ తేదీ వరకూ అందరికీ జీతాలు ఇచ్చాం. కానీ ఇలా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఇకపై వేతనాలు ఇవ్వలేం. చాలా స్పష్టంగా చెబుతున్నాం. కశ్మీరీ పండిట్‌లు ఈ మాటను చెవికెక్కించుకోవాలి. అర్థం చేసుకోవాలి" అని అన్నారు. నిరసనల్లో పాల్గొంటున్న ఉద్యోగులతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారు మనోజ్ సిన్హా...వారి సమస్యలు తీర్చుతామని భరోసా ఇచ్చారు. కానీ...వాళ్లు మాత్రం "మాకు భరోసా లేదు" అంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు. 


బదిలీ చేసే ఆలోచన లేదు..


ఇదే సమయంలో ఉద్యోగుల బదిలీ విషయాన్నీ ప్రస్తావించారు. కశ్మీరీ పండిట్‌లను జమ్ముకు బదిలీ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. వీరి భద్రత కోసం ప్రత్యేక బలగాలను జిల్లా హెడ్‌క్వార్టర్స్ వద్ద ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామీణ అభివృద్ధి విభాగంలో పని చేసే ఉద్యోగులను సమీపంలోని గ్రామాలకు, జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌కు మాత్రమే బదిలీ చేస్తున్నామని వెల్లడించారు. వాళ్లు అందించే ఫిర్యాదులనుస్వీకరించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్‌లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు తున్నారు. ఇటీవల పండిట్‌లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయడంతో అక్కడ పరిస్థితులు భయాందోళనగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల షోపియాన్ జిల్లా, చౌదరిగుండ్ గ్రామం నుంచి చిట్ట చివరి కశ్మీరీ పండిట్ మహిళ కూడా ఆ గ్రామాన్ని విడిచి పెట్టింది. చౌదరిగుండ్ గ్రామం నుంచి ఉగ్రవాదుల భయంతో కశ్మీరీ పండిట్‌లు తరలివెళ్లిపోయారు. అయితే డోలీ కుమారి అనే మహిళ మాత్రం ధైర్యంగా అక్కడే ఉంది. తరవాత ఆమె కూడా ఆ గ్రామాన్ని విడిచిపెట్టింది. జమ్మూకు వలస వెళ్లిపోయింది. ఇటీవల కశ్మీరు లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగాయి. దీంతో ఈ గ్రామంలో మిగిలిన ఏడు కశ్మీరీ పండిట్ కుటుంబాలు నెమ్మదిగా జమ్మూకు వలసపోయాయి.


Also Read: Zelenskyy On US Aid: మీరిచ్చేది చారిటీ కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం పెడుతున్న పెట్టుబడి - అమెరికాలో జెలెన్‌స్కీ