Indian Student Surrendered To Ukrainian Forces:  గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థి మజోటి సహిల్ మొహమ్మద్ హుస్సేన్  ఉక్రెయిన్  సైన్యానికి బందీగా చిక్కాడు.   రష్యాలో చదువులకు వెళ్లిన తర్వాత డ్రగ్స్ కేసులో చిక్కుకుని, జైలు శిక్షను తప్పించుకోవాలని రష్యన్ సైన్యంలో చేరాడు. అయితే, మూడు రోజుల పోరాటం తర్వాత ఉక్రెయిన్ సైన్యానికి లొంగిపోయాడు.  "రష్యాలో జైలు కంటే ఇక్కడే జైలు వెళ్లడం మంచిది" అని చెప్పుకున్నాడు. ఈ ఘటన  వైరల్ అవుతోంది. 

Continues below advertisement

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) రష్యన్ అధికారులతో మాట్లాడి, భారతీయుల రిక్రూట్‌మెంట్‌ను సైన్యంలో ఆపమని కోరింది. గుజరాత్ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు.  తమ కుమారుడ్ని విడిపించుకుని తీసుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

మోర్బీ, గుజరాత్‌కు చెందిన మజోటి సహిల్ మొహమ్మద్ హుస్సేన్ (22) చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు పొందాడు. తల్లి-తండ్రులు విడిపోయిన తర్వాత తల్లి, తాతలతో ఉండేవాడు. కుటుంబ సభ్యులందరూ విద్యావంతులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.  రష్యాలో ఉన్నత విద్యకు వెళ్లిన సహిల్, అక్కడ డ్రగ్స్ సంబంధిత కేసులో పట్టుబడ్డాడు. రష్యన్ అధికారులు అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే అతనికి సైన్యంలో చేరే ఆఫర్ ఇచ్చారు. జైలు వెళ్లడం కంటే సైన్యంలో చేరడం మంచిదని భావించి చేరిపోయాడు.  రష్యా 'స్పెషల్ మిలిటరీ ఆపరేషన్'  లో పాల్గొనడానికి అంగీకరించాడు. 16 రోజుల శిక్షణ పొందిన తర్వాత, అక్టోబర్ 1న మొదటి కాంబాట్ మిషన్‌కు  పంపారు.  మూడు రోజుల పోరాటం తర్వాత రష్యన్ కమాండర్‌తో  గొడవ పెట్టుకున్నాడు. 

అక్టోబర్ 4న ఉక్రెయిన్ 63వ మెకానైజ్డ్ బ్రిగేడ్ సైనికులకు మజోటి సరెండర్ అయ్యాడు. 2-3 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ ట్రెంచ్ పొజిషన్ చూసి, తుపాకీ వదిలేసి సరెండర్ అయిపోయాడు.  ఉక్రెయిన్ సైన్యం టెలిగ్రామ్‌లో వీడియో విడుదల చేసింది, ఇందులో సహిల్ తన కథను వివరించాడు. MEA  రష్యన్ సైన్యంలో భారతీయుల రిక్రూట్‌మెంట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది.   రష్యన్ అధికారులతో మాట్లాడి, ఈ పద్ధతిని ఆపమని కోరారు.  రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 100కి పైగా భారతీయులు రిక్రూట్ అవ్వగా, 20 మంది మరణించారని రికార్డులు చెబుతున్నాయి.