Wrestlers Protest: 


ఏషియన్ గేమ్స్‌పై క్లారిటీ 


కేంద్రంతో చర్చలు జరుగుతున్న తరుణంలో రెజ్లర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. Asian Gamesలో ఆడతారా లేదా అన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చింది రెజ్లర్ సాక్షి మాలిక్. సోనిపట్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె...ప్రస్తుత సమస్య పరిష్కారం అయ్యాకే ఆ గేమ్స్‌లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. తాము ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నామో ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 15లోగా బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 


"మా డిమాండ్‌లు తీర్చినప్పుడు, సమస్యలు పరిష్కారమైనప్పుడే ఏషియన్ గేమ్స్‌లో ఆడతాం. రోజూ మేము ఎంత మానసిక వేదనకు గురవుతున్నామో ఎవరికీ అర్థం కావడం లేదు"


- సాక్షి మాలిక్, రెజ్లర్ 





"WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించడం నేను చూశాను. మద్యం మత్తులో ఇదంతా చేశాడు. 2013లో మేం థాయ్‌లాండ్‌కి వెళ్లాం. అప్పుడే తొలిసారి బ్రిజ్ భూషణ్ అసలు స్వరూపం బయపడింది"


- జగ్బీర్,ఇంటర్నేషనల్ రెఫరీ 


కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షిమాలిక్ భేటీ అయ్యారు. తమ డిమాండ్‌లనూ వినిపించారు. మొత్తం 4 డిమాండ్‌లు వినిపించిన రెజ్లర్లు...రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి మహిళా చీఫ్‌ని నియమించాలని కోరారు. తమపై పోలీసులు నమోదు చేసిన FIRలను విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్‌పై విచారణ జరిపి ఆయనను అరెస్ట్ చేయాలని తేల్చి చెప్పారు. ఓ మైనర్ రెజ్లర్‌ని కూడా ఆయన లైంగికంగా వేధించారని ఆరోపించారు రెజ్లర్లు. అంతే కాదు. రెజ్లింగ్ ఫెడరేషన్‌లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, మహిళను చీఫ్‌గా నియమిస్తే సమస్యలు తీరిపోతాయని అనురాగ్ ఠాకూర్‌కి వివరించినట్టు తెలుస్తోంది.


Also Read: కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?