UP News: ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధార్థ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 


ఇదీ జరిగింది


ఆదివారం తెల్లవారుజామున సిద్ధార్థ్‌నగర్‌ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి  చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను గోరఖ్‌పూర్‌ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వివాహ వేడుకకు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు.


క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నట్లు సమాచారం. 


నివాళి










ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందినవారికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ఆర్థికసాయం ప్రకటించారు.


Also Read: Sidhu Skipped Dinner: జైలులో డిన్నర్ చేయని సిద్ధూ- ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?


Also Read: PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు