Social Media: సోషల్ మీడియాను ఉపయోగించడానికి కనీస వయోపరిమితిని ఏర్పాటు చేయాలని, ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కర్ణాటక హైకోర్టు మంగళవారం ప్రతిపాదించింది. పాఠశాలలు, కళాశాలకు వెళ్లే పిల్లలను సోషల్ మీడియాకు అలవాటు  పడడం ద్వారా కలిగే ప్రమాదాలపై చర్చల సందర్భంగా, న్యాయమూర్తులు జి.నరేందర్ విజయ్‌కుమార్, పాటిల్‌లతో కూడిన ధర్మాసనం ఈ సిఫార్సు చేసింది. మైనర్లలో సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోర్లు సూచించింది.


సోషల్ మీడియాపై నిషేధాన్ని అమలు చేయడం లేదా, వినియోగదారులకు కనీస వయస్సు 21 ఏళ్లుగా నిర్ణయించాలని కోర్టు సిఫార్సు చేసింది. పాఠశాలకు వెళ్లే పిల్లలు సోషల్ మీడియాకు బానిస అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలోని ఓ కంటెంట్ చూసిన 17 లేదా 18 ఏండ్ల పిల్లలకు.. అది దేశ ప్రయోజనాలకు సంబంధించినదా  కాదా  అని నిర్ధారించే పరిపక్వత ఉంటుందా అని నిలదీసింది. దేశంలో మద్యం విక్రయించేందుకు, ఓటు హక్కు కల్పించేందుకు వయసును పరిగణలోకి తీసుకుంటున్నారని, సోషల్ మీడియా వినియోగానికి సైతం ఏజ్ లిమిట్ ఉండాలని అభిప్రాయపడింది.


నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలనే కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) చేసిన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ గేమ్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఆధార్, ఇతర డాక్యుమెంటేషన్‌ను అందించడం తప్పనిసరి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కోర్టు స్పందిస్తూ, సోషల్ మీడియాకు ఇలాంటి చర్యలను ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించింది. సర్దుబాట్లు మార్పుల అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. నిర్దిష్ట నియమాలు, మార్గదర్శకాల ఆధారంగా స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు అవసరాన్ని బెంచ్ వివరించింది. 


అంతేకాకుండా కంటెంట్ తొలగింపుపై , X Corp సహజ, సానుకూల తీర్పులను ఆశించకూడదని కోర్టు పేర్కొంది. ప్రశ్నలోని కంటెంట్ సమాచార సాంకేతిక చట్టం, 2000, సెక్షన్ 69A (1), (2)ను ఉల్లంఘిస్తుందో లేదో అంచనా వేసే ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపించినప్పుడు మాత్రమే నిరోధించే ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది


దీనిపై X Corp తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. పోస్ట్‌లు, అకౌంట్ బ్లాకింగ్‌పై చట్టాల వివరణకు సంబంధించి గతంలో సింగిల్ జడ్జి చేసిన పరిశీలనలు అప్పీల్‌కే పరిమితమైందని వివరించారు. వివాదాస్పద పోస్ట్‌లు, ఖాతాలను బ్లాక్ చేయాలనే డిమాండ్‌లకు X Corp కట్టుబడి ఉందని పేర్కొంన్నారు. అయితే, 1,000కి పైగా ట్వీట్‌లను తీసివేయమని చెప్పడానికి తగిన కారణాలు లేవన్నారు.  


కొన్ని యూఆర్‌ఎల్స్‌ను బ్లాక్ చేయాలని, పోస్టులు డిలీట్ చేయాలని భారత ప్రభుత్వంX Corpకు ఉత్తర్వులను జారీ చేసింది. దీనిని X Corp సవాలు చేసింది. కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి X Corp సవాలును తిరస్కరించారు. లింకులను బ్లాక్ చేయడం ఆలస్యం చేసినందుకు రూ. 50 లక్షల జరిమానా విధించారు. దీనిపై X Corp డివిజనల్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. ఆగస్టు 10న సింగిల్ జడ్జి ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అప్పటికే ఎక్స్ రూ.25 లక్షలు జమ చేసింది.