Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి ముంబై వెళ్లిన ప్రైవేటు జెట్ విమానం రన్ వే నుంచి జారింది. తరువాత విమానం నుంచి మంటలు ఎగశాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటన సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. 






వైజాగ్ నుంచి ముంబై వెళ్లిన VSR వెంచర్స్ లీర్‌జెట్ 45 ఎయిర్‌క్రాఫ్ట్ VT-DBL విమానం ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా క్రాస్ ల్యాండింగ్ జరిగింది.  ముంబైలో కురుస్తున్న భారీ వర్షంతో 700 మీటర్ల విజబులిటీ ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారని ముంబై విపత్తు అధికార యంత్రాంగం తెలిపింది.