Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే

ABP Desam   |  Murali Krishna   |  20 May 2022 02:38 PM (IST)

Prashant Kishor on Congress: కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విమర్శించారు.

కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే

 Prashant Kishor on Congress: కాంగ్రెస్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన చింత‌న్ శిబిర్‌పై విరుచుకుప‌డ్డారు. ఇదో విఫ‌ల చింత‌న్ శిబిర్ అంటూ కౌంటర్ వేశారు.

ఉద‌య్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన కాంగ్రెస్ చింత‌న్ శిబిర్‌పై నా అభిప్రాయాన్ని చెప్పాలంటూ కొంద‌రు ప‌దే ప‌దే అడ‌గ‌డం వ‌ల్లే నేను స్పందిస్తూన్నాను. ఈ శిబిరం ద్వారా కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులూ సంభ‌వించ‌వు. య‌థాత‌థ స్థితే ఉంటుంది. ప్ర‌స్తుత నాయ‌క‌త్వానికి కాస్త స‌మ‌యం ఇచ్చారు. రాబోయే గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఓడిపోయే వరకూ కాంగ్రెస్‌లో ఈ య‌థాతథ స్థితి ఇలాగే ఉంటుంది.                                                                       - ప్రశాంత్ కిశోర్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త

కాంగ్రెస్‌ను కాదని

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని బతికించుకునేందుకు కొత్త వ్యూహకర్త కావాలని భావించి ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానించింది. ఆయన కూడా వెంటిలేటర్‌ మీద ఉన్న హస్తం పార్టీకి ప్రాణం నింపేందుకు ముందుకు వచ్చారు. అధినాయకత్వంతో నాలుగైదు సార్లు భేటీ అయ్యారు. 

తన వ్యూహాలకు పదునుపెట్టి మిషన్‌ 400 అంటూ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇదంతా గమనించిన హస్తం హైకమాండ్‌ పీకేను తమ నేతగా మార్చుకునేందుకు ప్రయత్నించింది.

కొంతకాలంగా జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్‌ కిశోర్‌ ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. సోనియాగాంధీ, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. కానీ కాంగ్రెస్‌లో తాను అనుకున్న పదవిని, స్థాయిని సోనియా గాంధీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఆఫర్‌ను పీకే తిరస్కరించారు.

సెకండ్ ఇన్నింగ్స్

త్వరలోనే బిహార్‌ నుంచి ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు పీకే తెలిపారు. 3వేల కిమీ పాదయాత్రను అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రారంభిస్తానని ప్రకటించారు. ఇప్పుడప్పుడే పార్టీ స్థాపనపై ఆలోచించడం లేదని ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని పీకే అన్నారు.

Also Read: Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Also Read: Bengaluru airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు- భద్రత పెంపు

Published at: 20 May 2022 01:57 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.