PM Modi To Address The Nation | న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే, సాయంత్రం ఆయన ప్రసంగం అంశంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ రేపటి నుంచి జీఎస్టీ కొత్త స్లాబ్స్ అమల్లోకి రానుండటం, మరోవైపు అమెరికా H1b Visa ఫీజు లక్ష డాలర్లు చేసిన సమయంలో ప్రధాని మోదీ ప్రసంగంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నవరాత్రి వేడుకలకు ఒకరోజు ముందు ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. నవరాత్రి తొలిరోజు (సెప్టెంబర్ 22) నుంచే GST రేటు కోతలు అమల్లోకి వస్తాయి. కొత్త GST సంస్కరణలతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.

Continues below advertisement

భారతదేశానికి పెద్ద శత్రువు ఎవరూ లేరు

ప్రధాని మోదీ శనివారం గుజరాత్‌ను సందర్శించారు. అక్కడ బావ్‌నగర్ నుంచి రూ. 34,200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. భావ్‌నగర్‌లో జరిగిన 'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇతర దేశాలపై ఆధారపడటమే భారతదేశానికి ప్రధాన శత్రువు అని అన్నారు. "భారతదేశం ప్రపంచ సోదరభావ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. నేడు ప్రపంచంలో భారతదేశానికి పెద్ద శత్రువు ఎవరూ లేరు, కానీ నిజమైన అర్థంలో, భారతదేశానికి అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమే" అని ప్రధాని మోదీ అన్నారు, భారతదేశం యొక్క ఆధారపడటాన్ని సమిష్టిగా ఓడించాలని నొక్కి చెప్పారు.

Continues below advertisement

దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ఆదివారం ఉదయం ప్రధాని మోదీ మహాలయ అమావాస్య సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గా పూజ పవిత్ర రోజులు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరి జీవితం వెలుగులు, లక్ష్యంతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. "దేవి దుర్గా మాత కైలాస పర్వతం నుండి భూమికి ఈ రోజున దిగి వస్తుందని భక్తులు నమ్ముతారు" అందరికీ శుభో మహాలయ! దుర్గా పూజ నవరాత్రి సమీపిస్తున్నందున, మన జీవితాలు వెలుగులతో ఉండాలని కోరుకుంటున్నాను" అని మోదీ X లో అన్నారు. "మా దుర్గా మాత దైవిక ఆశీర్వాదాలు అచంచలమైన బలం, శాశ్వతమైన ఆనందం, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలి" అని ఆయన అన్నారు.

H-1B వీసాల రుసుము ఏడాదికి 100,000 డాలర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల రుసుమును ఏడాదికి 100,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.88 లక్షలు)కు పెంచుతూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అమెరికాలో వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సమయంలో ఈ ఉత్తర్వు జారీ అయింది. నిజంగా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులను మాత్రమే అమెరికాలోకి తీసుకురావాలని, అక్కడి కంపెనీలు అమెరికన్లను భర్తీ చేయడం పెంచాలన్నదే లక్ష్యంగా ట్రంప్ పెట్టుకున్నారు.