PM Cares Fund: 'ఓ కుటుంబ సభ్యుడిగా ఇదంతా చేస్తున్నా'- పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి మోదీ శ్రీకారం

ABP Desam   |  Murali Krishna   |  30 May 2022 12:47 PM (IST)

PM Cares Fund: 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సాయం చేయనున్నారు.

'ఓ కుటుంబ సభ్యుడిగా ఇదంతా చేస్తున్నా'- పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి మోదీ శ్రీకారం

PM Cares Fund: కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారుల కోసం పీఎం కేర్స్ పథకానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకం కింద అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం చేయనున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసని మోదీ అన్నారు.

ఒక ప్రధానిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా పిల్లలతో మాట్లాడుతున్నా. దేశంలోని ప్రతిఒక్కరు ఈ పిల్లలకు అండగా ఉన్నారనే భరోసాను పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ కల్పిస్తోంది. అనాథలైన చిన్నారులు పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. 18-23 ఏళ్ల వారికి ప్రతినెల స్టైఫండ్​ అందుతుంది. వారు 23 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత రూ.10 లక్షలు వస్తాయి. పీఎం కేర్స్​ ద్వారా ఆయుష్మాన్​ హెల్త్​ కార్డు అందిస్తాం. దాని ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది.                                               - - ప్రధాని నరేంద్ర మోదీ

ఇదే లక్ష్యం

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్రం అండగా ఉండనుంది. 23 ఏళ్లు వచ్చేవరకూ వారి బాధ్యత భారత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ పథకం కింద 4345 మంది పిల్లలను ప్రధాని దత్తత తీసుకున్నారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశారు. 18 ఏళ్లు లోపు వారందరికీ పది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. 18 నుంచి 23 ఏళ్లు వచ్చేవరకూ ప్రతీ నెలా స్టైఫండ్ ఇవ్వనున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. 

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు- 25 మంది మృతి

Also Read: Sidhu Moosewala Death : పంజాబీ సింగర్ సిద్ధూ హత్య వెనుక కెనడా గ్యాంగ్ స్టర్, అకాలీ దళ్ లీడర్ హత్యకు ప్రతీకారమా?

Published at: 30 May 2022 12:04 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.