- హోమ్
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- ఆట
- వెబ్ స్టోరీస్
- ఫోటో గ్యాలరీ
- ఫ్యాక్ట్ చెక్
- బిగ్బాస్
- సినిమా
- టీవీ
- సినిమా రివ్యూ
- ఓటీటీ-వెబ్సిరీస్
- పర్సనల్ ఫైనాన్స్
- ఐపీవో
- మ్యూచువల్ ఫండ్స్
- ఆటో
- మొబైల్స్
- టీవీ
- గాడ్జెట్స్
- ల్యాప్టాప్
- వాస్తు
- శుభసమయం
- ఫుడ్ కార్నర్
- ఆరోగ్యం
- ఆయుర్వేదం
- ఎడ్యుకేషన్
- వెబ్ స్టోరీస్
- ఇండియా
- యువ
- క్రైమ్
- జాబ్స్
- ట్రెండింగ్
- రైతు దేశం
- పాలిటిక్స్
- న్యూస్
- ప్రపంచం
- హైదరాబాద్
- అమరావతి
- విశాఖపట్నం
- విజయవాడ
- రాజమండ్రి
- కర్నూల్
- తిరుపతి
- నెల్లూరు
- వరంగల్
- నల్గొండ
- కరీంనగర్
- నిజామాబాద్
India Pakistan Attack News Live: సరిహద్దుల్లో మళ్లీ పాకిస్థాన్ కాల్పులు - దీటుగా జవాబు ఇస్తున్న భారత్- జమ్మూ, అమృత్సర్, పఠాన్కోట్లో బ్లాక్అవుట్
Operation Sindoor 2.0: రెచ్చగొట్టి వేడుక చూద్దామని అనుకున్న పాకిస్థాన్కు భారత్ గట్టిగానే బుద్ది చెబుతోంది. వద్దంటున్నా సైనిక స్థావరాలపై దాడులు చేయడంతో భారత్ కాన్సెంట్రేషన్ చేసింది.
India Pakistan Attack News Live: పూంచ్లో పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు ప్రారంభించింది. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం చెబుతోంది. జమ్మూలోని అనేక చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
India Pakistan Attack News Live:జమ్మూ డివిజన్లోని అఖ్నూర్లో పూర్తి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. సైరన్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.
India Pakistan Attack News Live: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల మధ్య కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లోని పలు విమనాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 14 వరకు24 విమానాశ్రయాలు మూసివేస్తున్నట్టు వెల్లడించింది. కేంద్రం ఆదేశాల మేరకు 15వ తేదీ వరకు సరిహద్దు ప్రాంతాల్లోని విమానాశ్రయాల నుంచి పూర్తిగా విమాన సర్వీస్లు రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మూసివేసే విమానాశ్రయాలు ఇవే:-జమ్ము, శ్రీనగర్, లేహ్, జోద్పూర్, అమృతసర్ చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్కు సర్వీస్లు నిలిపివేసినట్టు పేర్కొంది.
India Pakistan Attack News Live:ఢిల్లీలోని ఎయిమ్స్లో పని చేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరించి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వైద్య కారణాల వల్ల తప్ప ఏ అధికారికి సెలవులు పెట్టడానికి లేదు. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వాళ్లు వెంటనే వాటిని రద్దు చేసుకొని విధుల్లో చేరాలని ఢిల్లీ ఎయిమ్స్ పేర్కొంది.
India Pakistan Attack News Live: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ప్రధానమంత్రి అధికారిక నివాసానికి చేరుకున్నారని ఐఎఎన్ఎస్ నివేదించింది. నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఆర్మీ చీఫ్ మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
India Pakistan Attack News Live: విదేశాంగ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కల్నల్ సోఫియా,"8-9 తేదీల రాత్రి, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసింది. ఇంత పెద్ద డ్రోన్ దాడికి అర్థం ఏమిటంటే? వారు భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ బలాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఈ డ్రోన్లు టర్కీకి చెందినవి. భారతదేశం చాలా డ్రోన్లను నాశనం చేసింది. పాకిస్తాన్ 36 ప్రదేశాలలో 400 కంటే ఎక్కువ డ్రోన్లతో దాడి చేసింది."
India Pakistan Attack News Live: విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా అనేక రైళ్లు రద్దు చేసింది భారత రైల్వే శాఖ.
రైలు నంబర్ 14895, భగత్ కోఠి - బార్మర్ రైల్వే సర్వీస్ 09.05.25న రద్దు
రైలు నంబర్ 14896, బార్మర్ - భగత్ కోఠి రైల్వే సర్వీస్ 09.05.25న రద్దు
రైలు నంబర్ 04880, మునాబావో - బార్మర్ రైలు సర్వీస్ 09.05.25న రద్దు
రైలు నంబర్ 54881, బార్మర్ - మునాబావో రైలు సర్వీస్ 09.05.25న రద్దు
India Pakistan Attack News Live: ఐపీఎల్ 2025 వాయిదాపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ, టోర్నమెంట్ ను వారం రోజుల పాటు నిలిపివేశామని అన్నారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
చండీగఢ్ మెడికల్ షాపులు తప్ప ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి అన్నీ మూతపడతాయని సూచనలు జారీ చేశారు. పాక్ నుంచి మళ్లీ దాడులు జరిగే అవకాశాలు ఉండడంతో చండీగఢ్లో ఈ ఉదయం మళ్లీ ఎయిర్ సైరన్ మెగింది . పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందనే ఎయిర్ఫోర్స్ స్టేషన్ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కనీసం బాల్కనీల్లోకి కూడా రావొద్దని హెచ్చరించింది.
భారత్ - పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతపై స్పందించారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మేం ఉగ్రవాదులను విడిచిపెట్టలేం అని తేల్చి చెప్పారు. పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ దుర్మార్గపు చర్యలు చేస్తున్న విధానం, పాక్ సైన్యం చేస్తున్న దాడులకు తగిన సమాధానం ఇస్తుందన్నారు
వ్యవసాయ నిల్వలు నిండుగా ఉన్నాయని స్పష్టం చేశారు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ . గోధుమలు, బియ్యం సహా ఇతర ధాన్యాలన్నీ మనకు తగినంత పరిమాణంలో ఉన్నాయన్నారు. సైనికులను సరిహద్దులో ఉన్నారు..రైతులు పొలాల్లో పనిచేస్తున్నారు. రైతులతో కలసి ఉత్పత్తిని పెంచడమే మా బాధ్యత అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్
INS విక్రాంత్ పాక్ లో మెయిన్ సిటీ అయిన కరాచీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడిలో కరాచీ నౌకాశ్రయం ధ్వంసమైంది. పాకిస్థాన్లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై భారత INS విక్రాంత్ క్షిపణులు ప్రయోగించింది. X హ్యాండిల్ కరాచీ పోర్ట్ ట్రస్ట్ ఒక పోస్ట్ పెట్టింది. దీనిపై అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఈ INS విక్రాంత్ తొలి దేశీయ విమాన వాహక నౌక.. కొచ్చి నౌకాశ్రయంలో దీన్ని నిర్మించగా ప్రధాని మోదీ 2022లో దీనిని జాతికి అంకితం చేశారు.
యూరీకి ప్రాంతానికి చేరుకున్నారు జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా . నిరంతరాయంగా పత్యర్థి కాల్పులను సమర్ధవంతంగా తిప్పకొడుతున్న భద్రతా బలగాలను ఎల్జీ ప్రత్యేకంగా కలిసి వారితో మాట్లాడుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి సమీప ప్రజల బాగోగులు, ప్రాణ నష్టంపై ఆరా తీయనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు NSA అజిత్ దోవల్, IB చీఫ్ . భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత గురించి హోంమంత్రితో చర్చించారు
India Pakistan Attack News Live: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలతో గుజరాత్ మరింత అప్రమత్తమైంది. ఈరోజు సీఎం భూపేంద్ర పటేల్ అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్లో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
India Pakistan Attack News Live: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఇందులో సీడీఎస్, త్రివిధ సైన్యాల అధిపతులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితిపై రక్షణ మంత్రి అధికారులతో మాట్లాడుతున్నారు.
India Pakistan Attack News Live: పాకిస్థాన్ పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. అది ప్రపంచ బ్యాంకు నుంచి రుణం కోరింది. దీనికి సంబంధించి X లో ఒక పోస్ట్ను షేర్ చేసింది.
India Pakistan Attack News Live: ముందుజాగ్రత్త చర్యగా, పౌరులు అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేయడానికి చండీగఢ్లో వైమానిక సైరన్లు మోగించారు. పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించారు.
India Pakistan Attack News Live: భారత్ నిన్న రాత్రి అనేక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లను ఉపయోగించింది. వీటిలో జు (ZU-23), శిల్కా, L-70 ఉన్నాయి. ఆకాశ్ క్షిపణి, S 400 క్షిపణిని కూడా ఉపయోగించారు.
India Pakistan Attack News Live: డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందని వైమానిక దళ కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికతో చండీగఢ్ మరోసారి అలర్ట్ అయింది. అధికారులు తాజాగా ఎయిర్ సైరన్ మోగించారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని సూచించారు. దాడులు జరిగే ప్రమాదం ఉందని వైమానిక దళ కేంద్రం నుంచి సమాచారం వచ్చిన చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. అందుకే సైరన్లు మోగుతున్నట్టు వెల్లడించారు.
India Pakistan Attack News Live: భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా ముందుజాగ్రత్త చర్యగా జమ్మూ కశ్మీర్లోని అన్ని పాఠశాలలు నేడు రేపు మూసివేశారు. జమ్మూ కశ్మీర్ విద్యామంత్రి సకినా ఇటూ నిన్న మాట్లాడుతూ మే 9, 10 తేదీల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేస్తున్నట్టు చెప్పారు.
Operation Sindoor Live: ఆపరేషన్ సిందూర్ అనంతర పరిస్థితులు దృష్ట్ట్యా, లేహ్, లద్దాక్, కర్గిల్ జిల్లాల్లో పూర్తి బ్లాక్ అవుట్ ప్రకటించారు
Operation Sindoor Live: ౩౦కి పైగా క్షిపణులు జైసల్మేర్పై దాడి జరిపాయని మాజీ కేంద్రమంత్రి కైలాష్ చౌదరి అన్నారు. అయితే భారతీయ సైన్యం వాటన్నింటినీ తిప్పి కొట్టిందన్నారు.
Operation Sindoor Live: జమ్ముకశ్మీర్లోని సరిహద్దు వెంబడి ఉన్న జమ్ము , పఠాన్ కోట్, ఉదంపూర్లోని సైనిక స్థావరాలను పాక్ మిస్సైళ్లు, డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ముప్పును మన వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి. ఎలాంటి నష్టం జరగలేదు- డిఫెన్స్ స్టాఫ్
Operation Sindoor Live: ఉద్రిక్తతలను నివారించాలని పాకిస్థాన్కు అమెరికా సూచించింది. యుఎస్ సెక్రటరీ మార్కో రూబియో పాకిస్థాన్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్తో మాట్లాడారు. దాడులను నిలుపదల చేయాలని సూచించారు.
Operation Sindoor Live: దేశంలో పరిస్థితుల దృష్ట్యా పౌరవిమానయాన శాఖ అన్ని సివిల్ ఎయిర్పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. టెర్మినల్స్ కు విజటర్ ఎంట్రీ నీలుపుదల చేశారు.
Background
Operation Sindoor 2.0: అసలే కుంటుతూ నడుస్తున్న సంగతి మర్చిపోయి భారత్తో పెట్టుకుంది పాకిస్థాన్. అనవసరంగా రెచ్చగొట్టినందుకు ఇప్పుడు ఉగ్రరాజ్యం మూల్యం చెల్లించుకుంటోంది. భారత్తో పోరులో తమకు అనేక దేశాలు కలిసి వస్తాయని భ్రమించి భారత్ను రెచ్చికొట్టింది. ఇప్పుడు భారత్ ఎదురుదాడి చేసేసరికి ఒంటరిగా పరుగులు పెడుతోంది. భారత్ సహనాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది.
ఏ దేశమైన సైన్యం అండతో పాలిస్తుంది. పాకిస్థాన్కు ఆ తెలివి ఎప్పుడో పోయింది. సైన్యాన్ని నమ్ముకుంటే ఎక్కడ వెన్నుపోటు పొడుస్తుందో అన్న భయంతో ఉగ్రమూకలను నమ్ముకుందీ. ఇప్పుడు అదే ఆ దేశం కొంప ముంచుతోంది. ప్రపంచ దేశాల్లో ఒంటిరైంది. సాయం చేసేందుకు చుట్టుపక్కల ఉన్న ఒక్క దేశం కూడా రావడం లేదు. చివరకు పెద్దన్న పెద్దన్న అంటూ చంకనెక్కి తిరిగిన చైనా కూడా హ్యాండ్ ఇచ్చింది. ఆ దేశం అమ్మిన ఆయుధాలు, ఇతర రక్షణ వ్యవస్థ కూడా కుప్పకూలింది. వాటి వల్ల పాకిస్థాన్కు కోట్ల నష్టం వాటిల్లిందే తప్ప కాపాడలేకపోయింది.