NIA raids: జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌(NIA) దేశ‌వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో దాడులు చేస్తోంది. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు ఉండ‌డం, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు నిధులు అందిస్తున్నార‌ని, అదేస‌మ‌యంలో తీసుకుంటు న్నార‌ని భావిస్తున్న‌వారి ఇళ్లు, ఆఫీసుల‌పై దాడులు కొన‌సాగుతున్నాయి. మొత్తం 17 ప్రాంతాల్లో జ‌రుగు తున్న ఈ సోదాలు, దాడుల్లో ఇప్ప‌టి వ‌రకు ఇద్ద‌రిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. కేర‌ళ‌(Kerala), క‌ర్ణాట‌క‌(Karnataka), త‌మిళ‌నాడు(Tamil Nadu) స‌హా ఏడు రాష్ట్రాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. 


ఎందుకింత హ‌డావుడి.. 
సాధార‌ణంగా ఇటీవ‌ల కాలంలో ఎన్ఐఏ(NIA) దాడులు చేయ‌డం ప‌రిపాటిగా మారింది. అయితే, ఒకే ద‌ఫా ఇలా ఏడు రాష్ట్రాల్లో 17 ప్రాంతాల్లో దాడులు చేయ‌డం, సోదాలు చేప‌ట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల బెంగ‌ళూరులోని ఓ జైల్లో ఉన్న ఖైదీల‌ను ఉగ్ర‌వాదం దిశ‌గా రెచ్చ‌గొట్ట‌డం, వారిని ఉగ్ర‌వాదం దిశ‌గా ప్రోత్స‌హించ‌డం వంటివి వెలుగు చూశాయి. ఈ జైల్లో ఉన్న ల‌ష్క‌ర్ ఏ తాయిబా(LeT) ఉగ్ర‌వాది టీ. న‌జీర్‌ ఈ చ‌ర్య‌లకు పాల్ప‌డిన‌ట్టు గుర్తించారు. మొత్తంగా ఐదుగురికి అత‌ను ఉగ్ర‌కార్య‌కలాపాల‌పై నూరిపోస్తున్న‌ట్టు తెలుసుకున్నారు. అదేవిధంగా దేశంలో ఉగ్ర కార్య‌క‌లాపాల‌కు సంబంధించి నిధుల రాక‌లు కూడా పెరిగిన‌ట్టు అధికారులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరు జైల్లో వెలుగు చూసిన‌.. ఉగ్ర‌వాద ప్రోత్సాహ‌క చ‌ర్య‌ల‌తో అలెర్ట్ అయిన అధికారులు స‌ద‌రు ఉగ్ర‌వాదిని విచారించ‌గా రాబ‌ట్టిన స‌మాచారంతో దేశ‌వ్యాప్తంగా సోదాలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైకి చెందిన ఇద్ద‌రిని అరెస్టు చేశారు వీరికి ఉగ్ర‌వాదుల‌కు నిధుల‌కు చేకూర్చే సంస్థ‌ల‌తో సంబంధాలు ఉన్న‌ట్టు అధికారులు నిర్ధారించారు.  


దుబాయ్ నుంచి రూ.ల‌క్ష‌ 
ఉగ్ర‌వాదుల‌కు నిధులు అందుతున్నాయ‌నే వాద‌న‌కు ఎన్ ఐఏ అధికారులు బ‌ల‌మైన ఆధారాల‌ను గుర్తించారు. దుబాయ్ నుంచి జ‌రిగిన ఓ లావాదేవీపై దృష్టి పెట్టిన అధికారుల‌కు ల‌ష్క‌రే తాయిబా ఉగ్ర‌కార్య‌ క్ర‌మాల‌కు సంబంధించి మ‌రో ఇద్ద‌రు అనుమానితులు త‌మీమ్ అశోక్‌(Thameem Ashok), హ‌స్సన్ అలీ(Hassan Ali)ల‌ను చెన్నైలో అరెస్టు చేశారు. త‌మీమ్‌ అశోక్ టీ న‌గ‌ర్‌(T Nagar)లోని ఓ న‌గ‌ల దుకాణంలో ప‌నిచేస్తున్నాడు. అదేవిధంగా త‌మీమ్ అశోక్ తండ్రి నివ‌శిస్తున్ రామనాథ‌పురంలో కూడా అధికారులు సోదాలు చేప‌ట్టారు.  అదేవిధంగా రామేశ్వ‌ర్ కేఫ్‌లో జ‌రిగిన బాంబు దాడులకు.. వీరికి లింకులు ఉన్న‌ట్టుగా అనుమానిస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.  


లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కార్యకర్త మరియు కింగ్‌పిన్, టి నజీర్, బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఐదుగురు ఖైదీల‌ను సమూలంగా మార్చాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జునైద్ అహ్మద్ పరారీలో ఉన్నాడు. గతేడాది అక్టోబరులో ఎన్‌ఐఏ ఈ కేసును స్వాధీనం చేసుకుని, అహ్మద్ ఇంటితో సహా అప్పట్లో సోదాలు నిర్వహించింది. జీవిత ఖైదు దోషి, లష్కరే తోయిబా ఉగ్రవాది టి నజీర్, బెంగళూరు సెంట్రల్ జైలులో అనేక మంది వ్యక్తులను సమూలంగా మార్చాడని, దేశంలో ఉగ్రదాడులకు ప్రేరేపించాడని అధికారులు నిర్ధారించారు. 


ఎవ‌రీ న‌జీర్‌.. 
ఎన్ ఐఏ విచారణను 25, అక్టోబర్ 2023న చేపట్టింది. 13, డిసెంబర్ 2023న ఈ కేసుకు సంబంధించి కొన్ని దాడులు నిర్వహించింది. ఈ కేసులో మంగళవారం NIA చేసిన దాడులకు బెంగళూరులోని ప్రముఖ కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనేది స్పష్టంగా తెలియలేదు, కానీ పరిణామాలు మాత్రం అనుమానాల‌ను బ‌ల‌ప‌డేలా చేస్తున్నాయి.  రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థ సోమవారం విచార‌ణ చేపట్టింది. బెంగళూరు జైలు రాడికలైజేషన్ కేసులో, ఫెడరల్ ఏజెన్సీ ఇప్పటికే నజీర్, ఇద్దరు పరారీలో ఉన్న ఎనిమిది మంది వ్యక్తులపై ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. కేరళలోని కన్నూర్‌కు చెందిన నజీర్ 2013 నుండి జీవిత ఖైదును అనుభవిస్తుండగా, విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్న జునైద్ అహ్మద్, సల్మాన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు వీరిని న‌జీరే ఉగ్ర‌వాద బాట ప‌ట్టించాడ‌ని అధికారులు చెబుతున్నారు.