Madhya Pradesh News: సీఎంకు చల్లారిపోయిన ఛాయ్ ఇచ్చినందుకు అధికారికి షోకాజ్ నోటీస్!

ABP Desam   |  Murali Krishna   |  12 Jul 2022 05:33 PM (IST)

Madhya Pradesh News: ముఖ్యమంత్రికి చల్లారిపోయిన టీ ఇచ్చినందుకు ఓ అధికారికి నోటీసులు అందాయి.

(Image Source: Pixabay)

 Madhya Pradesh News: ముఖ్యమంత్రికి చల్లారిన ఛాయ్ ఇచ్చినందుకు ఓ ప్రభుత్వ అధికారికి షోకాజ్ నోటీసు అందింది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది

ఛతర్‌పూర్ జిల్లా ఖజురహో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు నాణ్యత లేని చల్లని టీ అందించినందుకు జూనియర్ సప్లై ఆఫీస‌ర్‌ రాకేశ్‌ కనౌహాకు నోటీసు వచ్చింది. రాజ్‌నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) డీపీ ద్వివేది ఈ షోకాజ్ నోటీసు అందించారు.

మూడు రోజుల్లో దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఇందులో ఆదేశించారు. లేకుంటే ఏక‌ప‌క్షంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు హెచ్చ‌రించారు.

స్థానిక‌ సంస్థల ఎన్నికల ప్రచారం కోసం సీఎం చౌహాన్.. రేవాకు వెళ్తుండ‌గా సోమవారం ఖజురహో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ఉన్న సమయంలో ఆయ‌న‌కు, ఇతర అతిథులకు టీ అందించారు. అయితే, అది నాణ్య‌త‌లేకుండా చ‌ల్ల‌గా ఉంది. సీఎం రిఫ్రెష్‌మెంట్ ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించాల్సిన‌ కనౌహా ప్రొటోకాల్ నిబంధ‌న‌లు పాటించ‌లేదు. ఈ దుష్ప్రవర్తనకు సంబంధించి మీపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదో మాకు చెప్పండి.                                                                     -  నోటీసు

నోటీసు రద్దు

అయితే ఈ షోకాజ్ నోటీసు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో ఛతర్‌పూర్ కలెక్టర్ సందీప్ జీఆర్ ఆ షోకాజ్ నోటీసును రద్దు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘ‌న‌పై ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

Also Read: Monsoon Parliament Session: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు

Also Read: Rahul Gandhi Europe Visit: మరోసారి రాహుల్ గాంధీ ఫారెన్ టూర్- కీలక సమావేశాలకు లేనట్లే!

Published at: 12 Jul 2022 05:33 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.