Kedarnath Shrine Opens: పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం తిరిగి తెరుచుకుంది. ఉత్తరాఖండ్‌లో నెలకొన్న ఈ ఆలయం దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత నేటి నుంచి భక్తుల దర్శనార్థం తెరిచారు.శుక్రవారం ఉదయం 6.25 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు.






కనులపండువగా


అంతకుముందు ప్రధాన పూజారి నివాసం నుంచి కేదార్​నాథుడి డోలీని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి 10వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు.






ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున తొలి పూజ చేశారు అర్చకులు. హర్​ హర్​ మహాదేవ్​ నినాదాలతో ధామ్​ ప్రతిధ్వనించింది.


చార్‌ధామ్ యాత్ర


చార్​ధామ్​ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈనెల 3వ తేదీనే తెరుచుకున్నాయి. బద్రినాథ్​ ఆలయం ఈనెల 8వ తేదీన తెరవనున్నారు.


ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది.


Also Read: COVID Cases In India: కొత్తగా 3,545 కరోనా కేసులు నమోదు- ఎంత మంది మృతి చెందారంటే?


Also Read: Shankaracharya Jayanti 2022: శ్రీ చక్రం ఎంత పవర్ ఫులో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది