Jammu and Kashmir: కశ్మీరీ పండిట్ దారుణ హత్య- కాల్చి చంపిన ఉగ్రవాదులు!

ABP Desam   |  Murali Krishna   |  12 May 2022 10:46 PM (IST)

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

కశ్మీరీ పండిట్ దారుణ హత్య- కాల్చి చంపిన ఉగ్రవాదులు!

Jammu and Kashmir: 

జమ్ముకశ్మీరులోని ఓ కశ్మీరీ పండిట్‌ను అనుమానిత ఉగ్రవాదులు గురువారం కాల్చి చంపారు. బుద్గాం జిల్లాలోని చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ అనే వ్యక్తి గుమస్తాగా పని చేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాహుల్‌.. ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు.

ఇదీ జరిగింది

ప్రధాన మంత్రి ప్యాకేజి పథకంలో భాగంగా చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆయనపై గురువారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బుద్గాంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.

పోలీసులు అలర్ట్

ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు.

బుద్గాం జిల్లాలో రాహుల్ భట్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తున్నాను. ఈ ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులు శిక్ష నుంచి తప్పించుకోలేరు. మృతుడి కుటుంబానికి జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అండగా ఉంటుంది.                                                     - మనోజ్ సిన్హా జమ్ముకశమీర్ లెఫ్టినెంట్ గవర్నర్

Also Read: Sedition Law: రాజద్రోహం చట్టం గురించి తెలుసా? అభియోగాలు మోపిన కేసుల్లో నిరూపణ అయినవి ఇంతేనా!

Also Read: New Chief Election Commissioner: కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్- మే 15 నుంచి బాధ్యతల స్వీకరణ

Published at: 12 May 2022 10:45 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.