Indian Railway Rules: రైలును భారత్లో ఊరికే లైఫ్లైన్ అని అనలేదు. ప్రతిరోజూ లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేర్చే రైలు, ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయింది. తక్కువ ఛార్జీ ఉన్నప్పటికీ, కొందరు ప్రయాణికులు టిక్కెట్ లేకుండానే రైలులో ప్రయాణిస్తుంటారు. కానీ అలాంటి ప్రయాణికులకు ఇకనుంచి కష్టం తప్పదు. భారత రైల్వే ప్రయాణికుల కోసం నిబంధనలను గతంలో కంటే కఠినతరం చేసింది. టికెట్ లేని ప్రయాణాల వల్ల రైల్వేకు నష్టాలను తగ్గించడంతో పాటు వారిని గాడిన పెట్టడమే కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం.
ఇప్పుడు, ఎవరైనా ప్రయాణికుడు చెల్లుబాటు అయ్యే టిక్కెట్ లేకుండా చెకింగ్లో దొరికిపోతే, అతనిపై చర్యలు తీసుకుంటారు. జరిమానా కూడా గతంలో కంటే రెట్టింపు విధించనున్నారు. ఈ మార్పు వెనుక రైల్వే ఉద్దేశ్యం ఏంటంటే, దీనివల్ల ప్రయాణికులు మరింత క్రమశిక్షణగా ఉంటారు. టిక్కెట్ లేకుండా ప్రయాణించడం మరింతగా ఆగిపోతుంది.
కొత్త నిబంధనలు ఏమిటి?
భారతీయ రైల్వే కొత్త నిబంధనల ప్రకారం, జన విశ్వాస్ చట్టం 2026 కింద రైల్వే చట్టం 1989లోని సెక్షన్లు 137, 138లో మార్పులు చేశారు. దీని కింద, ఇప్పుడు టిక్కెట్ లేకుండా లేదా గతంలో ఉపయోగించిన టిక్కెట్తో ప్రయాణించడం నేరం అవుతుంది. ఎవరైనా ప్రయాణికుడు టికెట్ లేకుండా దొరికిపోతే పూర్తి అద్దె ఛార్జి మాత్రమే కాకుండా, అదనంగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 250 రూపాయలు ఉన్న జరిమానా ఇప్పుడు జరిమానా 500 (కనీసం) రూపాయలకు పెంచారు. ఈ నిబంధనలు జూన్ 20 నుంచే అమలులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
ఏయే సందర్భాలలో జరిమానా విధించనున్నారు?
- ఎవరైనానా ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ దొరికిపోతే.
- పాత టిక్కెట్తో ప్రయాణిస్తే జరిమానా విధించనున్నారు.
- లేదా ఎవరైనా వేరే టిక్కెట్ (రాంగ్ టికెట్)తో రైలులో ప్రయాణిస్తూ దొరికిన సమయంలో.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమవుతుంది ?
జరిమానా చెల్లించకపోతే కోర్టు చర్యలు తీసుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. టిక్కెట్ లేకుండా ప్రయాణించవద్దని రైల్వేశాఖ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. రైల్వే నిబంధనలను పాటించాలని, తద్వారా మీకు ఎలాంటి జరిమానా విధించరని పేర్కొంది.
Also Read: PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
